యాప్నగరం

ధోనీలా ఎవరూ ఆలోచించలేరంతే..!: ఆర్పీ సింగ్

వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ కదలికల ఆధారంగా వ్యూహాలు రచించే ధోనీ.. మ్యాచ్‌లను ఓ ప్లాన్ ప్రకారం తెలివిగా ఫినిష్ చేస్తుంటాడు.

Samayam Telugu 27 Apr 2020, 8:44 am
Samayam Telugu RP Singh, MS Dhoni
మైదానంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మహేంద్రసింగ్ ధోనీ తరహాలో ఎవరూ భిన్నంగా ఆలోచించలేరని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ కితాబిచ్చాడు. భారత్ తరఫున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లాడిన ఆర్పీ సింగ్‌.. ధోనీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని పేరుంది. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ పేసర్.. 2011లో చివరిగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

Read More:భారత క్రికెటర్‌కి క్రిస్‌గేల్ సీరియస్ వార్నింగ్.. కోహ్లీ కూడా ఫైర్

మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ గురించి ఆర్పీ సింగ్ తాజాగా మాట్లాడుతూ ‘‘ధోనీ కంటే మెరుగ్గా మైదానంలో మ్యాచ్‌ గమనాన్ని చదవగలిగే వారిని నేను చూడలేదు. టీమ్‌కి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. వ్యూహాలు రచించడం, సవాళ్లని ఛేదించడంలో అతను దిట్ట. ధోనీ తరహాలో భిన్నంగా ఆలోచించేవారిని నా కెరీర్‌లో ఎవరినీ చూడలేదు’’ అని వెల్లడించాడు.

Read More: హర్భజన్ సింగ్‌ని తొక్కేశారు: పాక్ స్పిన్నర్ ఆరోపణ

భారత్‌కి కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అలానే టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియాని నెం.1 స్థానంలో నిలిపిన ధోనీ.. 2014లో టెస్టులకి, 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.