యాప్నగరం

కుంబ్లేకి జరిగిన అవమానం చాలు..!

హుందాతనానికి ప్రతిరూపమైన అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లికి మధ్య తలెత్తిన విభేదాలు ఏమాత్రం

TNN 28 Jun 2017, 8:33 pm
భారత్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న విధానం చూసిన తర్వాత క్రికెట్ దిగ్గజాలు ఎవరూ ఆ స్థానం కోసం ఆశించరని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోచింగ్ స్టైల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లికి అభ్యంతరాలు ఉండటంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కుంబ్లే సుదీర్ఘ లేఖ ద్వారా వెల్లడించాడు.
Samayam Telugu no top player will want to coach team india
కుంబ్లేకి జరిగిన అవమానం చాలు..!


‘హుందాతనానికి ప్రతిరూపమైన అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లికి మధ్య తలెత్తిన విభేదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కనీసం దిగ్గజ క్రికెటర్‌ అనే గౌరవం కూడా కోహ్లి ఇవ్వకపోవడం బాధాకరం. కుంబ్లేకి జరిగిన అవమానం చూసిన తర్వాత ఏ దిగ్గజ క్రికెటర్ కూడా కోచ్ పదవిని చేపట్టాలని భావించడు. భారత్ క్రికెటర్లు తమ ప్రాక్టీస్, లోపాలను ఎత్తిచూపకుండా స్వేచ్ఛగా వదిలేసే కోచ్‌ని కోరుకుంటున్నారు. అలా అయితే జట్టుకి మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి..?’ అని గవాస్కర్ ప్రశ్నించాడు.

ప్రస్తుతం కోచ్ రేసులో రవిశాస్త్రి, టామ్ మూడీ, సెహ్వాగ్ పేర్లు వినిపిస్తున్నా.. కోహ్లితో పాటు ఆటగాళ్లందరూ రవిశాస్త్రి కోచ్‌గా రావాలని కోరుకుంటున్నారు. దీంతో బీసీసీఐ కూడా అతనివైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.