యాప్నగరం

విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌కి రెస్ట్..?

దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడిన భారత సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో

TNN 23 Feb 2018, 2:05 pm
దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడిన భారత సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో శనివారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌తో ఆ సిరీస్‌ ముగియనుండగా.. అనంతరం భారత్ మార్చి 6 నుంచి శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. అయితే ఈ ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినివ్వాలని భారత సెలక్టర్లు చర్చిస్తున్నారట. గత రెండేళ్లుగా వన్డే, టీ20ల్లో మెరుగ్గా రాణిస్తూ.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్టుల్లోకి కూడా జస్‌ప్రీత్ బుమ్రా అరంగేట్రం చేశాడు.
Samayam Telugu not just virat kohli but another star player likely to miss t20i tri series report
విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌కి రెస్ట్..?


ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్.. అనంతరం కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో ఈ ఫాస్ట్ బౌలర్‌కి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికాతో ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, రెండు టీ20లు విరామం లేకుండా ఆడాడు. దీంతో అతడికి కూడా విశ్రాంతినిస్తే.. బాగుంటుందని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. ముక్కోణపు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు ఆదివారం జట్టుని ప్రకటించనున్నారు. అయితే.. జట్టుని ప్రకటించే ముందు సీనియర్ క్రికెటర్లతో ఒకసారి చర్చించి అనంతరం నిర్ణయం తీసుకోవాలనే సెలక్టర్లు ఉన్నారట..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.