యాప్నగరం

అర్ధశతకం బాదిన ధావన్ ఔట్

పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకం సాధించిన అనంతరం

TNN 25 Oct 2017, 8:01 pm
పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకం సాధించిన అనంతరం ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్ వేసిన మిల్నే బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించిన ధావన్ (68: 84 బంతుల్లో 5x4, 2x6) ఫీల్డర్ రాస్ టేలర్‌కి చిక్కాడు. దీంతో 64 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
Samayam Telugu nz fight back with dhawan wicket
అర్ధశతకం బాదిన ధావన్ ఔట్


ఓపెనర్ రోహిత్ శర్మ (7) ఆదిలోనే ఔటైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (29)తో కలిసి శిఖర్ ధావన్ జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తూ విరాట్ కోహ్లి కూడా పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి మూడో వికెట్‌కి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్ అర్ధశతకం సాధించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ధావన్ ఔటయ్యే సమయానికి భారత్ 29.2 ఓవర్లలో 145/3తో ఉంది. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 230 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.