యాప్నగరం

ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే..? ఇక అంతే..!

2019 జులైలో ఆఖరిగా క్రికెట్ మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియాకి పూర్తిగా దూరమైపోయాడు. కనీసం ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా ధోనీ మెరుపులు చూడాలని ఆశించిన అభిమానులకి నిరాశే ఎదురైంది.

Samayam Telugu 11 Apr 2020, 5:18 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే..? మళ్లీ అతడ్ని వెనక్కి తీసుకురావడం అసాధ్యమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. దీంతో.. ధోనీ పునరాగమనం కష్టమేనంటున్న క్రికెట్ పండితులు.. ఇక రిటైర్మెంట్ తరువాయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Samayam Telugu MS Dhoni , Virat Kohli


Read More: ధోనీని ఆ సమస్య బాధపెట్టింది: మాజీ కీపర్

ధోనీ కెరీర్‌ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హుస్సేన్ మాట్లాడుతూ ‘‘భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఏడాది టీమిండియా ఛేజింగ్‌కి దిగిన సమయంలో ధోనీ ఓ రెండు సందర్భాల్లో తడబడ్డాడు. కానీ.. ఇప్పటికీ అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అందుకే.. అతని రిటైర్మెంట్‌ని అడిగే విషయంలో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ ధోనీ ఆటకి వీడ్కోలు పలికితే..? మళ్లీ క్రికెట్‌లోకి అతడ్ని తీసుకురావడం ఎవరితరం కాదు. ధోనీ లాంటి క్రికెటర్లు తరానికి ఒక్కరే ఉంటారు. అలాంటి ఆటగాడ్ని రిటైర్మెంట్‌ ఇవ్వాలని తొందర పెట్టకూడదు’’ అని సూచించాడు.

Read More: కరోనాతో ఫైట్.. ఢిల్లీ పోలీసులకి కోహ్లీ సెల్యూట్

భారత్‌కి 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ధోనీ.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ఇప్పటికీ అరుదైన రికార్డ్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ని మూడు సార్లు టైటిల్ విజేతగా ధోనీ నిలిపిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.