యాప్నగరం

సిమ్లాలో ధోనీ పర్యటన వివాదం.. అసెంబ్లీలో దుమారం

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సిమ్లా పర్యటనపై వివాదం చెలరేగిన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ స్పందించారు.

Samayam Telugu 29 Aug 2018, 10:36 pm
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సిమ్లా పర్యటనపై వివాదం చెలరేగిన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ స్పందించారు. ధోనీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆయనకు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తోందని వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ధోనీ సిమ్లా పర్యటనపై వాడీవేడి చర్చ జరగ్గా.. సీఎం స్వయంగా వివరణ ఇచ్చారు. దేహ్రా ఎమ్మెల్యే హషియార్‌ సింగ్‌ ఈ అంశంపై అసెంబ్లీలో ప్రశ్న వేశారు.
Samayam Telugu dhoni


ఒక వాణిజ్య ప్రకటన కోసం ధోనీ సిమ్లాకు 5 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. సోమవారం (ఆగస్టు 27) ఆయన సిమ్లాకు చేరుకున్నారు. ధోనీతో పాటు ఆయన సతీమణి సాక్షి కూడా ఉన్నారు. ఆగస్టు 31 వరకు ఆయన అక్కడే బస చేయనున్నారు. ధోనీ పర్యటనకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జైరాం ఠాకూర్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

‘సిమ్లాలో ధోనీకి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ మాత్రమే కల్పించింది. ఆయన ఇక్కడ బస చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయలేదు. ఒక క్రీడా ప్రముఖుడైన ధోనీకి రక్షణ కల్పించడం మన కనీస బాధ్యత’ అని సీఎం జైరాం అన్నారు. ధోనీని ‘రాష్ట్ర అతిథి’గా ప్రకటించడంపై ప్రశ్నించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌విందర్‌ సింగ్‌ సుక్‌ మాట్లాడుతూ.. తాము ఆ విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.