యాప్నగరం

పాకిస్థాన్ గడ్డపై 14 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా టీమ్

పాకిస్థాన్‌లో భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్లు గత దశాబ్దకాలంగా ఆ దేశంలో పర్యటించేందుకు నిరాకరిస్తూ వచ్చాయి. కానీ.. గత ఏడాది శ్రీలంక జట్టు పర్యటించగా.. తాజాగా సఫారీ టీమ్..?

Samayam Telugu 16 Jan 2021, 7:32 pm
పాకిస్థాన్ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. జనవరి 26 నుంచి రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ని పాకిస్థాన్‌తో ఆడేందుకు శనివారం అక్కడికి సఫారీ టీమ్‌ చేరుకుంది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్‌లో ఉగ్రదాడి తర్వాత ఓ అగ్రశ్రేణి జట్టు పూర్తి స్థాయిలో సిరీస్ ఆడేందుకు పాక్‌కి వెళ్లడం ఇదే తొలిసారికాగా.. 2007లో చివరిగా ఆ గడ్డపై దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు ఆడింది.
Samayam Telugu South Africa Team (Image Source: OfficialCSA/ Twitter)


జనవరి 26న కరాచీ వేదికగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత రావల్పిండిలో ఫిబ్రవరి 4 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 11, 13, 14న లాహోర్‌ వేదికగా వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్ డికాక్‌ ఇప్పటి వరకూ పాకిస్థాన్ గడ్డపై కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.


దక్షిణాఫ్రికా టీమ్‌కి స్టేట్ లెవల్ గెస్ట్ సెక్యూరిటీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందిస్తోంది. విమానాశ్రయం నుంచి కరాచీలోని హోటల్‌కి సుమారు 500 మంది పారా మిలిటరీ రేంజర్స్‌‌ పహారా మధ్య దక్షిణాఫ్రికా ఆటగాళ్లని తరలించింది. రోడ్డుపైనే కాదు.. హెలికాప్టర్ సాయంతో ఆటగాళ్లు వెళ్తున్న వెహికల్‌ని సెక్యూరిటీ సిబ్బంది అనుసరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.