యాప్నగరం

10ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్థాన్ గడ్డపై టెస్టు క్రికెట్

దశాబ్దకాలంగా యూఏఈ వేదికగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న పాకిస్థాన్‌కి ఊరట లభించబోతోంది. ఆ దేశంలో పర్యటించి టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక అంగీకరించింది.

Samayam Telugu 15 Nov 2019, 7:19 am
పాకిస్థాన్ గడ్డపై క్రికెట్‌ మళ్లీ జీవం పోసుకుంటోంది. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా సాహసించలేదు. దీంతో.. యూఏఈని సొంత వేదికగా మార్చుకుని ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మళ్లీ.. ఇన్నాళ్లకి స్వదేశంలో టెస్టులు ఆడబోతోంది.
Samayam Telugu pak vs sl test series pakistan to host sri lanka for two tests in december
10ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్థాన్ గడ్డపై టెస్టు క్రికెట్


Read More: షమీ బంతికి నోరెళ్లబెట్టిన రహీమ్.. క్లీన్‌బౌల్డ్
శ్రీలంక‌ని డిసెంబరులో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఒప్పించిన పాకిస్థాన్.. షెడ్యూల్‌ని కూడా తాజాగా ప్రకటించింది. రావల్పిండి వేదికగా డిసెంబరు 11 నుంచి 15 వరకూ తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 19 నుంచి 23 వరకూ కరాచీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టూర్‌ని విజయవంతంగా నిర్వహించగలిగితే..? మళ్లీ పాక్‌లో క్రికెట్‌కి పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ పర్యటనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Read More: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్

వాస్తవానికి ఇటీవల పాకిస్థాన్‌‌లో మూడు టీ20ల సిరీస్‌ని శ్రీలంక ఆడింది. కానీ.. భద్రత కారణాలు చూపుతూ ఈ సిరీస్‌కి శ్రీలంక అగ్రశ్రేణి క్రికెటర్లు లసిత్ మలింగ, ఏంజిలో మాథ్యూస్, గుణతిలక తదితరులు దూరంగా ఉన్నారు. దీంతో.. ద్వితీయ శ్రేణి జట్టుని పాక్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు పంపింది. కానీ.. తాజాగా టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంక మెయిన్ జట్టే ఆ దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీ20 సిరీస్‌ కోసం పాక్ గడ్డపైకి వచ్చిన జట్టుకి దేశాధ్యక్షుడి స్థాయి భద్రతని పీసీబీ కల్పించిన విషయం తెలిసిందే.

Read More: బంగ్లాపై టెస్టులో రోహిత్ శర్మ టీ20 షాట్.. ఔట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.