యాప్నగరం

ఇంగ్లాండ్ టూర్‌ని గెలుపుతో ముగించిన పాకిస్థాన్

ఇంగ్లాండ్ విజయానికి చివరి 6 బంతుల్లో 17 పరుగులు అవసరమగా.. టామ్ కరన్ ఓ సిక్స్ బాదేశాడు. దాంతో.. మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొనగా.. పాకిస్థాన్ తెలివిగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకుంది.

Samayam Telugu 2 Sep 2020, 10:14 am
ఇంగ్లాండ్ గడ్డపై ఎట్టకేలకి పాకిస్థాన్ గెలుపు రుచి చూసింది. ఆగస్టు 5 నుంచి మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడిన పాకిస్థాన్ 0-1తో టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్నా.. టీ20 సిరీస్‌ని మాత్రం 1-1తో సమం చేసింది. మాంచెస్టర్ వేదికగా తాజాగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడిన పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్థాన్ పర్యటన ముగియగా.. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
Samayam Telugu England vs Pakistan 2020


మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్.. మహ్మద్ హఫీజ్ (86 నాటౌట్: 52 బంతుల్లో 4x4, 6x6), హైదర్ అలీ (54: 33 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్‌.. మొయిన్ అలీ (61: 33 బంతుల్లో 4x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గెలిచేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో పుంజుకున్న పాకిస్థాన్ బౌలర్లు ఇంగ్లాండ్‌ని 185/8కే పరిమితం చేసేశారు.

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మొయిన్ అలీ ఔటవగా.. చివరి 6 బంతుల్లో ఇంగ్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హారీష్ రౌఫ్ బౌలింగ్‌కి రాగా.. ఆదిల్ రషీద్ (3 నాటౌట్), టామ్ కరన్ (8 నాటౌట్) జోడీ 11 పరుగులే రాబట్టగలిగింది. చివరి ఓవర్‌ ఐదో బంతికి సిక్స్ బాదిన కరన్.. చివరి బంతికి కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. దాంతో.. పాక్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. పాక్‌కి మెరుగైన స్కోరు అందించిన మహ్మద్ హఫీజ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.