యాప్నగరం

మా జట్టుకు ఇప్పుడిదే ప్రధాన సమస్య: పాక్ కోచ్

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌ చేతిలో వరుసగా రెండుసార్లు పాకిస్థాన్ ఓడటం పట్ల ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందించాడు.

Samayam Telugu 24 Sep 2018, 12:43 pm
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (114), రోహిత్ శర్మ (111 నాటౌట్) రాణించడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. భారత్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడటంతో పాక్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
Samayam Telugu pak coach


తమ జట్టు ప్రస్తుతం ఆత్మవిశ్వాస లేమితో కొట్టుమిట్టాడుతోందని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌పై పాక్ ఆటతీరు పట్ల పెదవి విరిచిన ఆయన.. తమ జట్టు చేసిన చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని విమర్శించాడు. మా ఆటగాళ్లు కాన్ఫిడెన్స్ క్రైసిస్‌తో బాధపడుతున్నారు. డ్రెస్సింగ్ రూంలో ఓటమి భయం ఉంది. క్రికెట్ జట్టుగా మేం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సి ఉందని ఆర్థర్ తెలిపాడు.

‘‘భారత్‌లో చాలా మంచి ఆటగాళ్లున్నారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆదివారం జరిగిన మ్యాచ్2లో అదే జరిగింది. బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు, బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలి. మాకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తే ఆధిపత్యం చెలాయిస్తారు. మేం వాస్తవికంగా ఆలోచించాలి. అద్భుతమైన భారత జట్టు చేతిలో ఓడాం. మా ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నార’’ని ఆర్థర్ చెప్పాడు.

బుమ్రా మ్యాచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 20 నిమిషాలపాటు చూశాను. అతడు వరుసగా యార్కర్ల మీద యార్కర్లు సంధించాడు. మా యంగ్ బౌలర్లు ఇలా వేయడం నేర్చుకోవాలి. డెత్ ఓవర్లలో భువీ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఆర్థర్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.