యాప్నగరం

పాక్‌కు బీసీసీఐ రూ.451కోట్లు ఇవ్వాలట!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).

TNN 1 Dec 2017, 10:37 am
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). టీమిండియా తమ దేశ జట్టుతో ఆడాల్సిన మ్యాచ్ లు ఆడకపోవడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని.. ఇందుకు గానూ బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాలనేది పీసీబీ వాదన. అల్లాటప్పాగా కాదు.. ఏకంగా 451 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని బీసీసీఐ తమకు చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి నోటీసు ఇచ్చింది పీసీబీ. ఈ విషయాన్ని ఐసీసీ కూడా ధ్రువీకరించింది.
Samayam Telugu pakistan cricket board seeks 70m from bcci for unplayed series
పాక్‌కు బీసీసీఐ రూ.451కోట్లు ఇవ్వాలట!


రెండు దేశాల బోర్డుల మధ్య ఒప్పందం ప్రకారం 2014.2015లలో టీమిండియా పాక్ తో వన్డే, టెస్టు సీరిస్ లు ఆడాల్సి ఉంది. అయితే 2008లో ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి ఆ దేశ జట్టుతో ద్వైపాక్షిక సీరిస్ లను రద్దు చేసుకుంది బీసీసీఐ. దీంతో అప్పటి నుంచి రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సీరిస్ లు ఏవీ జరగలేదు. పాక్ జట్టుతో టీమిండియాను ఆడించడానికి బీసీసీఐ ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

తటస్థ వేదికలపై అయినా మ్యాచ్ లు జరపాలనేది పీసీబీ డిమాండ్. అయితే ఆ ప్రతిపాదనలను బీసీసీఐ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ నేఫథ్యంలో బీసీసీఐ నుంచి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది పీసీబీ. ఏకంగా 451 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టింది. ఈ విషయంపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.