యాప్నగరం

భారత అమ్మాయిని పెళ్లాడనున్న పాకిస్థాన్ క్రికెటర్

మరో దాయాది క్రికెటర్ భారత అమ్మాయిని పెళ్లాడనున్నాడు. పాక్ ఫాస్ట్ బైలర్ హసన్ అలీ హర్యానాకు చెందిన షమియా అర్జూను నిఖా చేసుకోనున్నడు. దుబాయ్‌లో వీరి పెళ్లి జరగనుంది.

Samayam Telugu 30 Jul 2019, 6:24 pm
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారత అమ్మాయిని పెళ్లాడనున్నాడు. హర్యానాలోని మేవాట్ జిల్లా‌కు చెందిన షమియా అర్జూను అతడు నిఖా చేసుకోనున్నాడు. ఆగష్టు 20న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటళ్లో వీరి నిఖా జరగనుంది. పాకిస్థాన్ క్రికెటర్ భారత మహిళను పెళ్లాడటం ఇదే తొలిసారి కాదు. హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్‌లు కూడా భారత అమ్మాయిలనే పెళ్లాడారు.
Samayam Telugu hasan ali


షమియా మనవ్ రచనా యూనివర్సిటీ నుంచి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. గతంలో జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేసిన ఆమె ప్రస్తుతం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. నిఖా కోసం షమియా తండ్రి లియాఖత్ అలీ, పది మంది కుటుంబ సభ్యులు ఆగష్టు 17న యూఏఈ వెళ్తారని సమాచారం.

హసన్ అలీ ఇప్పటి వరకూ పాకిస్థాన్ తరఫున 53 వన్డేలు ఆడి 82 వికెట్లు తీశాడు. 9 టెస్టుల్లో 31 వికెట్లు పడగొట్టాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన జట్టులో హసన్ అలీ కీలక సభ్యుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.