యాప్నగరం

దాదా పూనుకుంటేనే దాయాదులపోరు:పాక్ ప్లేయర్ల అభ్యర్థన

సంక్షోభంలో ఉన్న భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ సంబంధాలను గాడిలో పెట్టాలని బీసీసీఐ చీఫ్ గంగూలీని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభ్యర్థించాడు. 2004లో దాదా చొరవతోనే భారత్.. తమదేశంలో పర్యటించిందని గుర్తుచేశాడు.

Samayam Telugu 3 Jan 2020, 7:58 pm
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగక చాలా కాలమైంది. ముఖ్యంగా 2008 ఉగ్రదాడి జరిగిన అనంతరం పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ చెక్ పెట్టింది. ఈక్రమంలో ఆదేశంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడుతోంది. ఈక్రమంలో తమ దేశంలో క్రికెట్‌ను బతికించడంతోపాటు దాయాదుల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణ కోసం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ముందడుగు వేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభ్యర్థిస్తున్నాడు.
Samayam Telugu Kolkata: BCCI President Sourav Ganguly addresses during the inauguration of 25th...
BCCI President Sourav Ganguly


Read Also : మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా.. తర్వాత ఎవరు..?
నిజానికి 2004లో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక పోరుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో గంగూలీ కలుగజేసుకుని సిరీస్‌లను సజావుగా సాగేందుకు ఉపకరించడాని లతీఫ్ గుర్తుచేశాడు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల్లో దాదా మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు 2004లో వన్డే, టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. ఎన్నో మధురస్తృతులను మూటగట్టుకుందని గుర్తుచేశాడు.

Read Also : Kuldeep Yadavను ట్రోల్ చేసిన చాహల్
మరోవైపు 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగాక పాక్‌లో చాలాకాలం తర్వాత క్రికెట్ సిరీస్‌లు జరుగలేదు. మధ్యలో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో సిరీస్‌లను నిర్వహించింది. గతనెలలోనే లంకతో రెండు టెస్టుల సిరీస్ జరిగింది. ప్రస్తుతం పాక్‌లో సాధారణ పరిస్థితులున్నాయని, అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతుండడం పట్ల లతీఫ్ సానుకూలంగా స్పందించాడు. గతంలో గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే పాక్‌లో ఇండియా పర్యటించిందని, అప్పట్లో బీసీసీఐ సుముఖంగా లేనప్పటికీ దాదానే అందరినీ ఒప్పించి పర్యటన ఖరారు చేశాడని కొనియాడాడు. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ హోదాలో ఉన్న దాదా మరోసారి పాక్‌లో పర్యటన జరిగేలా చూడాలిన అభ్యర్థించాడు.

Read Also : కోహ్లీ 10 ఏళ్ల ప్రస్థానం...స్లిప్పర్ల నుంచి ప్యూమా షూ వరకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.