యాప్నగరం

కోహ్లీపై పాక్ పేసర్ ప్రశంసలు

విరాట్ కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. అతడు మ్యాచ్ విన్నర్ అని అందరికీ తెలుసు.

Samayam Telugu 7 Sep 2018, 7:22 pm
గత కొన్ని నెలలుగా విశ్రాంతి లేకుండా సిరీస్‌లు ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆసియా కప్ నుంచి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఎంతో ప్రమాదకారి అని అలాంటి కీలక ఆటగాడు లేకపోవడం ప్రత్యర్థి జట్లకు కలిసొస్తుందని పాకిస్థాన్ పేసర్ హసన్‌ అలీ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఆసియా కప్ టోర్నీకి ఓపెనర్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15న యూఏఈలో ఆసియాకప్‌ ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ 19న జరగనుంది.
Samayam Telugu Hasan Ali And Virat Kohli


హసన్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. అతడు మ్యాచ్ విన్నర్ అని అందరికీ తెలుసు. అతడు ఉన్నంతవరకూ టీమిండియా పటిష్టంగానే ఉంటుంది. కోహ్లీ జట్టులో లేకపోవడం ప్రత్యర్థి జట్టకు సానుకూలాంశం. అయితే కోహ్లీ లాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడాన్ని నిజంగానే మిస్సవుతున్నాను. ప్రతి బౌలర్ అతడి వికెట్ తీయాలని ఆశ పడతాడు.

టోర్నీ నెగ్గెందుకు శాయశక్తులా యత్నిస్తాం. కోహ్లీ నాకు సీనియర్. అతడితో ఏ విధంగానూ నన్ను పోల్చవద్దు. కోహ్లీలా ప్రస్తుతం నేను ఫిట్‌నెస్ మీద దృష్టిసారిస్తున్నా. భారత్ సహా ఇతర ప్రత్యర్థి జట్లపై ఎలా నెగ్గాలి.. వారి బలహీనతలు ఏమున్నాయో తెలుసుకుంటాం. వన్డేల్లో ప్రదర్శనతో టెస్టు జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తా. అన్ని ఫార్మాట్లలో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నది లక్ష్యమని’ పేసర్ హసల్ అలీ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.