యాప్నగరం

పాక్ క్రికెటర్లకి భయం.. రిటైర్మెంట్‌కి కారణం చెప్పిన మహ్మద్ అమీర్

ఐదేళ్ల నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్థాన్ అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. కానీ.. మూడేళ్లలోనే..?

Samayam Telugu 1 Dec 2020, 7:00 pm
పాకిస్థాన్ క్రికెటర్లు తమకి రెస్ట్ కావాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ని అడిగితే..? ఎక్కడ వేటు వేస్తారో అని భయపడుతున్నట్లు ఆ దేశ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన ఆరోపణలు చేశాడు. వన్డే, టీ20ల్లో కొనసాగేందుకు 27 ఏళ్ల వయసులోనే టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్.. దాదాపు ఏడాది తర్వాత తన వీడ్కోలు నిర్ణయంపై అసలు కారణాన్ని బహిర్గతం చేశాడు. గత ఏడాది జులైలో టెస్టులకి అమీర్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు.. అతను పాక్ జట్టు భవిష్యత్ గురించి పట్టించుకోకుండా స్వార్థపూరితంగా నిర్ణయం తీసుకున్నాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
Samayam Telugu Mohammad Amir (Getty Images)
File photo of Mohammad Amir (Getty Images)


పాక్ టీమ్‌లోని ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదని తాజాగా చెప్పుకొచ్చిన మహ్మద్ అమీర్.. తాను కూడా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ‘‘పాక్ జట్టులోని క్రికెటర్లు తమకి రెస్ట్ కావాలని మేనేజ్‌మెంట్‌ని అడగాలంటే భయపడుతున్నారు. దానికి కారణం.. రెస్ట్ పేరుతో తమపై ఎక్కడ వేటు వేస్తారో అని కంగారు. ఆటగాడు తనకి విశ్రాంతి కావాలని కోరాడంటే..? అతని కోణంలో మేనేజ్‌మెంట్ ఆలోచించాలి. అంతేతప్ప అతడిపై వేటు వేసేయకూడదు. వ్యక్తిగతంగా నేను కూడా 2017 నుంచి ఈ సమస్యని ఎదుర్కొన్నాను. టీమ్‌లో నాపై పనిభారం పెరుగుతోందని అప్పటి కోచ్‌తో పాటు మేనేజ్‌మెంట్‌కి చెప్పినా పట్టించుకోలేదు. దాంతో.. నేను గాయంతోనే వన్డే ప్రపంచకప్‌లో ఆడాల్సి వచ్చింది. అందుకే.. పనిభారం తగ్గించుకునే ఉద్దేశంతో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నా’’ అని అమీర్ వెల్లడించాడు.

2010లో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన మహ్మద్ అమీర్‌పై అప్పట్లో ఐదేళ్ల నిషేధం పడింది. నిషేధం తర్వాత పునరాగమనం చేసిన అమీర్.. 2017 ఛాంపియన్స్‌ట్రోఫీని పాకిస్థాన్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్‌ నాటికి అతని బౌలింగ్‌లో వాడి తగ్గింది. మూడు ఫార్మాట్లు, బిజీ షెడ్యూల్స్ కారణంగా.. మోకాలి, భుజం గాయం అతని లయని దెబ్బతీసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.