యాప్నగరం

ఫస్ట్ వన్డేలో పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ సెంచరీ.. నెదర్లాండ్ టార్గెట్ 315

Fakhar Zaman century బాదడంతో నెదర్లాండ్స్‌పై తొలి వన్డేలో పాకిస్థాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో పాటు కీపర్ రిజ్వాన్ తేలిపోయినా కెప్టెన్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. బాబర్- ఫకార్ జోడి రెండో వికెట్‌కి ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో.. పాకిస్థాన్‌ 314 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆసియా కప్ ముంగిట ఫకార్ జమాన్ ఫామ్‌లోకి రావడం పాక్‌కి కలిసొచ్చే అంశం.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 16 Aug 2022, 6:55 pm

ప్రధానాంశాలు:

  • నెదర్లాండ్స్‌పై సెంచరీ బాదిన ఫకార్ జమాన్
  • బాబర్ అజామ్‌తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం
  • 314 పరుగులు చేసిన పాకిస్థాన్ టీమ్
  • ఆసియా కప్ ఈ నెల 27 నుంచి స్టార్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Fakhar Zaman, Babar Azam (Pic Credit: TheRealPCB/Twitter)
ఫకార్ జమాన్, బాబర్ అజామ్ (Pic Credit: TheRealPCB/Twitter)
ఆసియా కప్ 2022 ముంగిట నెదర్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టీమ్ బ్యాటింగ్‌లో అదరగొట్టేస్తోంది. రోటర్ డ్యామ్ వేదికగా నెదర్లాండ్స్‌తో మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ ఫకార్ జమాన్ (109: 109 బంతుల్లో 12x4, 1x6) సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ బాబర్ అజామ్ (74: 85 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకాన్ని బాదాడు. చివర్లో షదాబ్ ఖాన్ (48 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 2x6) కూడా దూకుడుగా ఆడేశాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్థాన్ టీమ్ యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియా కప్‌లో ఆడబోతోంది. ఈ టోర్నీలో భాగంగా 28న భారత్‌తో తన ఫస్ట్ మ్యాచ్‌ని పాక్ ఆడనుండటంతో నెదర్లాండ్స్‌ టూర్‌‌లో సత్తాచాటాలని పాక్ టీమ్ ఆశిస్తోంది. కానీ ఈరోజు మ్యాచ్‌లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2) తక్కువ స్కోరుకే ఔటైపోయి నిరాశపరిచాడు.

ఇమామ్ ఉల్ హక్ ఔటైపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్‌తో కలిసి ఫకార్ జమాన్ రెండో వికెట్‌కి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. నెదర్లాండ్స్ బౌలర్లని ఓ ఆట ఆడుకున్న ఈ జోడి దాదాపు 28 ఓవర్లు అసలు వికెటే ఇవ్వలేదు. అయితే బాబర్ ఔట్ తర్వాత పాక్ తడబడింది. మహ్మద్ రిజ్వాన్ (14), కుష్‌దిల్ షా (21), మహ్మద్ నవాజ్ (4) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. చివర్లో షబాద్ ఖాన్, సల్మాన్ (27 నాటౌట్: 16 బంతుల్లో 3x4) ఏడో వికెట్‌కి 25 బంతుల్లోనే అజేయంగా 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పాక్ 314 పరుగులు చేయగలిగింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.