యాప్నగరం

​ భారత్‌ని ఓడించిన పాక్ జట్టుకి భారీ నజరానా

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులోని ఒక్కో ఆటగాడికి

TNN 21 Jun 2017, 5:15 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ని ఓడించి టైటిల్ గెలిచిన పాకిస్థాన్‌ జట్టుకి ఆ దేశ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆదివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 180 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ఈ టైటిల్‌ని పాక్ చేజిక్కించుకుంది. దీంతో పాకిస్థాన్‌ అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి. మంగళవారం ఆ దేశానికి చేరిన క్రికెట్ జట్టుకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Samayam Telugu pakistan team awarded bonus from pm and pcb
​ భారత్‌ని ఓడించిన పాక్ జట్టుకి భారీ నజరానా


పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున బోనస్ ప్రకటించగా.. ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సైతం రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. టోర్నీ ద్వారా వచ్చిన ఫ్రైజ్‌మనీ 29 మిలియన్ డాలర్లు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆధారంగా ఆటగాళ్లందరికీ పంచనున్నట్లు క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్‌తో జట్టు సహాయకులకి సముచిత రీతిలో నజరానా అందనున్నట్లు బోర్డు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.