యాప్నగరం

టీ20ల్లో పాకిస్థాన్ నెం.1 రికార్డ్.. భారత్ ఎక్కడో

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో గత కొంతకాలంగా నెం.1 స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్.. మరో రికార్డ్‌ని కూడా అందుకోబోతోంది. ఈ రికార్డ్‌లో పాక్‌తో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉంది.

Samayam Telugu 24 Jan 2020, 11:27 am
అంతర్జాతీయ టీ20ల్లో ఈరోజు పాకిస్థాన్ అరుదైన ఘనతని సొంతం చేసుకోబోతోంది. లాహోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్.. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన తొలి జట్టుగా రికార్డుల్లో నిలవనుంది. ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ ఐదో స్థానంలో ఉంది.
Samayam Telugu pakistan vs bangladesh pak set to become 1st country to feature in 150 t20i matches
టీ20ల్లో పాకిస్థాన్ నెం.1 రికార్డ్.. భారత్ ఎక్కడో


Read More: రోహిత్ శర్మ డిఫెన్స్, కోహ్లీ హిట్టింగ్.. కివీస్‌తో టీ20లకి భారత్ కొత్త వ్యూహం

2006, ఆగస్టులో ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడిన పాకిస్థాన్.. ఇప్పటి వరకూ 149 మ్యాచ్‌లాడింది. ఇందులో ఏకంగా 90 మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందగా.. 55 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు టైగా ముగియగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.

Read More: ఈరోజే IND vs NZ 1st T20.. కివీస్ గడ్డపై కోహ్లీసేనకి సవాల్.. టీ20 రికార్డ్స్‌తో బెంగ
2006, డిసెంబరులో దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ ఆడిన భారత్ జట్టు ఇప్పటి వరకూ 129 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఇందులో 81 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. 44 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక మిగిలిన నాల్గింటిలో ఫలితం తేలలేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.