యాప్నగరం

​ సఫారీలు.. కేప్‌టౌన్‌లో తేల్చుకుందాం రండి

సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకి భారత నయా ఆల్‌రౌండర్

TNN 6 Feb 2018, 1:01 pm
సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకి భారత నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సవాల్ విసిరాడు. కేప్‌టౌన్ వేదికగా బుధవారం మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హార్దిక్ పాండ్య ‘ఇప్పుడే దిగాం. కేప్‌టౌన్‌లో సత్తా చాటేందుకు ఇదే తగిన సమయం’ అంటూ రాసుకొచ్చాడు.
Samayam Telugu pandya sounds warning bells for proteas says time to rock cape town
​ సఫారీలు.. కేప్‌టౌన్‌లో తేల్చుకుందాం రండి


దక్షిణాఫ్రికా గడ్డపై పర్యటనని భారత్ జట్టు కేప్‌టౌన్‌ టెస్టుతోనే ఆరంభించగా.. ఆ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మొత్తం ఘోరంగా విఫలమైనా హార్దిక్ పాండ్య (93: 95 బంతుల్లో 14x4, 1x6) ఒక్కడే చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ టెస్టులో భారత్ 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. కానీ.. వన్డే సిరీస్‌ ఆరంభం నుంచి టీమిండియా అసాధారణ రీతిలో విజయాలు సాధిస్తోంది. గత ఆదివారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టుని కుప్పకూల్చిన తీరు భారత్ జోరుకి నిదర్శనం. దీంతో పాటు.. డుప్లెసిస్, డివిలియర్స్, డికాక్ జట్టుకి దూరమవడం కూడా సఫారీలను కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే తగిన సమయమని టీమిండియా భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.