యాప్నగరం

పార్థీవ్ అద్భుత శతకం.. గుజరాత్‌ ఖాతాలో తొలి రంజీ ట్రోఫీ

రంజీ ట్రోఫీ ఫైనల్లో పార్థీవ్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌కు తొలి ట్రోఫీని అందించాడు.

TNN 14 Jan 2017, 4:49 pm
గుజరాత్ జట్టు తొలిసారిగా రంజీ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లో ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో పార్థీవ్ పటేల్ అద్భుత సెంచరీతో గుజరాత్‌కు ట్రోఫీని అందించాడు. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు రంజీ ఫైనల్ చర్రితలోనే భారీ స్కోరును చేధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన కెప్టెన్ పార్థీవ్ పటేల్ రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసి విజయానికి బాటలు వేశాడు. ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ ఆధిక్యం కనబర్చగా.. మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరిసింది.
Samayam Telugu parthiv 143 leads gujarat to maiden title
పార్థీవ్ అద్భుత శతకం.. గుజరాత్‌ ఖాతాలో తొలి రంజీ ట్రోఫీ


ఆధిక్యం చేతులు మారుతూ సాగిన టైటిల్‌ పోరులో.. రెండో ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేసిన ముంబై జట్టు గుజరాత్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 47/0తో నాలుగో రోజు ఆట ముగించిన గుజరాత్‌ చివరి రోజు ఐదు వికెట్లు కోల్పోయి విజయానికి అవసరమైన 265 పరుగులను సాధించింది. 54 పరుగులు చేసిన జునేజా పార్థీవ్‌కు చక్కటి సహకారం అందించాడు. రంజీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా పార్థీవ్ రికార్డు నెలకొల్పాడు.

A captain's knock! Well done @parthiv9 and Gujrat Cricket Association for winning maiden Ranji title @BCCIdomestic #RanjiTrophy #GUJvMUM — Anjum Chopra (@chopraanjum) January 14, 2017
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 228 పరుగులకు ఆలౌట్ కాగా, బదులుగా గుజరాత్ జట్టు 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న ముంబై జట్టు 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పటి వరకూ 46 సార్లు రంజీ ఫైనల్ చేరిన ముంబై జట్టు 41సార్లు టైటిల్ గెలుపొందింది. 1991-92 సీజన్లో హర్యానా చేతిలో రెండు పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఆ జట్టు ఫైనల్ చేరినా కప్ గెలవకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1950-51లో హోల్కర్ జట్టు చేతిలో రంజీ ఫైనల్లో ఓడిన గుజరాత్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత ఈ సీజన్లో ఫైనల్ చేరి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో.. దేశవాళీ క్రికెట్లో మూడు ప్రధాన టైటిళ్లయిన విజయ్ హజరే, రంజీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫ్రీలు గుజరాత్ ఖాతాలో చేరాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.