యాప్నగరం

​ ధోనీ లేడు కదా.. జట్టులో ఛాన్సివ్వరే..?

భారత్ జట్టులో పునరాగమనం కోసం తాను ఇంకా నిరీక్షిస్తున్నట్లు వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

TNN 31 Jul 2017, 5:16 pm
భారత్ జట్టులో పునరాగమనం కోసం తాను ఇంకా నిరీక్షిస్తున్నట్లు వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున వికెట్ కీపర్, ఓపెనర్‌గా పార్థీవ్ పటేల్‌ మెరుగ్గా రాణించినా.. సెలక్టర్ల నుంచి మాత్రం అతనికి పిలుపు అందలేదు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ.. కనీసం తనకు ఆ ఫార్మాట్‌లో కూడా చోటు దక్కకపోవడం శోచనీయమని ఈ వికెట్ కీపర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Samayam Telugu parthiv patel speaks about making a comeback to the indian side
​ ధోనీ లేడు కదా.. జట్టులో ఛాన్సివ్వరే..?


‘భారత్ జట్టులో ఓపెనర్‌గా లేదా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా.. ఇలా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకున్న అనుభవంతో అన్ని పరిస్థితుల్లోనూ రాణించగలనే నమ్మకం ఉంది. ఇప్పటికే కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మంచి ఫామ్ కనబరుస్తున్నా జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ.. ఆశ చంపుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నా’ అని పార్థీవ్ వివరించాడు. గత ఏడాది సాహా గాయపడటంతో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న పార్థీవ్ పటేల్ అర్ధశతకంతో మెరిసినా.. సాహా ఫిటెనెస్ సాధించడంతో మళ్లీ ఈ క్రికెటర్‌ని పక్కకి పెట్టేశారు.
"I’m ready for any role the team management wants me to do. Whether it is opening, batting in the middle-order, playing as keeper-batsman, keeper-opener, I’ve enough experience to adjust to the conditions. On top of that, my belief has helped me stay afloat,” said parthiv patel

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.