యాప్నగరం

దేశభక్తి ధోనీ రక్తంలోనే ఉంది.. అందుకే యాడ్స్‌కి దూరం: ధోనీ మేనేజర్

మార్చి నుంచి రాంచీలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. ఇటీవల తన పొలంలో వ్యవసాయం చేస్తూ కనిపిస్తున్నాడు. ట్రాక్టర్‌తో నేలను ధోనీ చదును చేస్తున్న వీడియో ఇటీవల వైరల్‌గా మారింది.

Samayam Telugu 10 Jul 2020, 5:46 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత మార్చి నుంచి ఎలాంటి యాడ్స్‌లో నటించడం లేదు. 2019, జులై నుంచి క్రికెట్‌కి ధోనీ దూరంగా ఉంటున్నా.. అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. దాంతో.. ధోనీతో యాడ్స్‌ చేయించడానికి వ్యాపార సంస్థలు ఇప్పటికీ పోటీపడుతున్నాయి. అయితే.. భారత్‌లో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఎలాంటి యాడ్స్‌లో నటించకూడదని ధోనీ నిర్ణయించుకున్నట్లు ధోనీ మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ వెల్లడించాడు.
Samayam Telugu MS Dhoni


‘‘దేశభక్తి ధోనీ రక్తంలోనే ఉంది. గత ఏడాది ఆర్మీలో కొన్ని రోజులు పనిచేశాడు. ఇప్పుడు రాంచీలో వ్యవసాయం చేస్తున్నాడు. ధోనీకి 40-50 ఎకరాల పొలం ఉంది. అందులో బొప్పాయి, అరటిని పండించడంలో అతను బిజీగా ఉన్నాడు. దేశంలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ఎలాంటి యాడ్స్‌లో నటించకూడదని ధోనీ నిర్ణయించుకుని.. ప్రస్తుతం వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నాడు’’ అని దివాకర్ వెల్లడించాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత ఆర్మీలో రెండు వారాల పాటు పనిచేశాడు. కెప్టెన్‌గా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన ధోనీకి ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదా లభించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. దాంతో.. ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.