యాప్నగరం

ధోనీకి బిడియమా..? హర్భజన్‌కి ఆశిష్ నెహ్రా పవర్ పంచ్

మహేంద్రసింగ్ ధోనీ ఎవరి రూములోకి వెళ్లడు.. అతనికి మహా సిగ్గు - హర్భజన్ సింగ్....... మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ రూము డోర్ ఓపెన్‌లోనే ఉంటుంది. ఎవరైనా అతని రూముకి వెళ్లొచ్చు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మరీ క్రికెట్ గురించి మాట్లాడొచ్చు - ఆశిష్ నెహ్రా

Samayam Telugu 8 May 2020, 1:20 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బిహేవియర్ గురించి ఇటీవల ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం ధోనీ మహా సిగ్గరి అని చెప్పుకొచ్చిన హర్భజన్ సింగ్.. కెప్టెన్‌గా మారిన తర్వాత కూడా అతనిలో మార్పురాలేదని వెల్లడించాడు. అయితే.. 2008లో సిడ్నీ వేదిక భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో చెలరేగిన ‘‘మంకీ గేట్’’ వివాదంతో ధోనీలో మార్పు వచ్చిందని భజ్జీ గుర్తుచేసుకున్నాడు. కానీ.. భజ్జీ చెప్పినట్లు ధోనీలో సిగ్గు, బిడియం లేవని తాజాగా నెహ్రా అతనికి పంచ్ ఇచ్చాడు.
Samayam Telugu Harbhajan Singh, MS Dhoni, Ashish Nehra,


‘‘మహేంద్రసింగ్ ధోనీ అంతర్ముఖుడని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని అందరూ అనుకుంటున్నారు. కానీ.. సిరీస్ లేదా టోర్నీ సమయాల్లో అతని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరైనా అతని రూముకి వెళ్లొచ్చు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మరీ అతనితో క్రికెట్‌ గురించి స్వేచ్ఛగా చర్చించొచ్చు’’ అని ఆశిష్ నెహ్రా వెల్లడించాడు. టీమిండియా లేదా ఐపీఎల్ మ్యాచ్‌‌కి ముందు ధోనీ టీమ్‌‌కి ఒక మెసేజ్‌ని పాస్ చేస్తాడని వివరించిన ఆశిష్ నెహ్రా.. దానిపై ఆటగాళ్ల నుంచి కూడా అభిప్రాయాలు కోరతాడని వివరించాడు. అంతకంటే టీమ్‌లో మంచి కమ్యూనికేషన్ ఏముంటుంది..? అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

2004లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే.. 2008లో మంకీ‌గేట్‌ వివాదంతో టీమిండియా ఆటగాళ్లు ఏకతాటిపైకి వచ్చారని అభిప్రాయపడిన హర్భజన్ సింగ్.. ఆ వివాదం తర్వాత ధోనీ అందరితోనూ చక్కగా కలిసిపోయాడని వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.