యాప్నగరం

ఓటమిని జీర్ణించుకోవడం కష్టం: విండీస్ కెప్టెన్

వెస్టిండీస్ జట్టుకి ఇది చాలా కఠినమైన సిరీస్.. మేము కూడా అత్యుత్తమంగా ఆడలేకపోయాం. మరోవైపు భారత్ జట్టు ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

Samayam Telugu 15 Oct 2018, 11:29 am
భారత్ చేతిలో.. అదీ చిత్తుగా 10 వికెట్ల తేడాతో ఓడటం తనని బాధిస్తోందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆ జట్టు భారత్ చేతిలో ఓడి సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులతో ఫర్వాలేదనిపించిన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మరీ పేలవంగా 127 పరుగులకే కుప్పకూలిపోయింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసిన భారత్ జట్టు.. లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే 75/0తో అలవోకగా ఛేదించేసింది. దీంతో.. సిరీస్‌లోని రెండు టెస్టులూ మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి.
Samayam Telugu ...
West Indies captain Jason Holder plays a shot during first day's play of second test match between India and West Indies in Hyderabad.Photo/Kamal Kishore)


‘నిజాయతీగా చెప్పాలంటే.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. అయితే.. జట్టు ఇలా ఎందుకు విఫలమైందో..? అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నా. ఈ ఓటములకి ఆటగాళ్లే పూర్తి బాధ్యత వహించాలి. వెస్టిండీస్ జట్టుకి ఇది చాలా కఠినమైన సిరీస్.. మేము కూడా అత్యుత్తమంగా ఆడలేకపోయాం. మరోవైపు భారత్ జట్టు ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. దీనికి తోడు.. సొంతగడ్డపై ఆడుతోంది. అయినప్పటికీ.. మా జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ చేజ్ శతకం బాదడం సానుకూలాంశం’ అని జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.