ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత బౌలర్లు ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్లు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ వెల్లడించాడు. నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ని ఆడనుంది. అక్కడి పిచ్లపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్ని వేగంగా అందుకునే ఆలోచనలో భాగంగా బౌలింగ్ వీడియోలను ప్రస్తుతం భారత బౌలర్లు చూస్తున్నట్లు షమీ వివరించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకి భారత సెలక్టర్లు చోటిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ పేసర్లు రాణించినా.. కోహ్లీ మినహా బ్యాట్స్మెన్స్ విఫలమవడంతో ఐదు టెస్టుల సిరీస్ని భారత్ 1-4తో చేజార్చుకుంది.
‘ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడ జరిగిన మ్యాచ్ల వీడియోలను ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. ఇంగ్లాండ్ టూర్లో ఫాస్ట్ బౌలింగ్ విభాగం మెరుగ్గా రాణించింది. అదే జోరుని ఆసీస్ గడ్డపైనా కొనసాగించాలని ఆశిస్తున్నాం. అయితే.. ఆసీస్ బలమైన జట్టు దానికి తోడు సొంతగడ్డపై ఆడుతుండటంతో వీలైనంత త్వరగా భారత పేసర్లు లైన్ అండ్ లెంగ్త్ని అందుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే.. సిరీస్లో సత్తాచాటే అవకాశం ఉంటుంది. అందుకే.. బౌలింగ్ వీడియోలు చూస్తూ.. ఆ దిశగా సన్నద్ధమవుతున్నాం’ అని మహ్మద్ షమీ వెల్లడించాడు.
‘ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడ జరిగిన మ్యాచ్ల వీడియోలను ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. ఇంగ్లాండ్ టూర్లో ఫాస్ట్ బౌలింగ్ విభాగం మెరుగ్గా రాణించింది. అదే జోరుని ఆసీస్ గడ్డపైనా కొనసాగించాలని ఆశిస్తున్నాం. అయితే.. ఆసీస్ బలమైన జట్టు దానికి తోడు సొంతగడ్డపై ఆడుతుండటంతో వీలైనంత త్వరగా భారత పేసర్లు లైన్ అండ్ లెంగ్త్ని అందుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే.. సిరీస్లో సత్తాచాటే అవకాశం ఉంటుంది. అందుకే.. బౌలింగ్ వీడియోలు చూస్తూ.. ఆ దిశగా సన్నద్ధమవుతున్నాం’ అని మహ్మద్ షమీ వెల్లడించాడు.