యాప్నగరం

IND vs AUS Test ని అరగంట చూసి నిరాశగా స్టేడియం నుంచి వెళ్లిపోయిన మోడీ

PM Narendra Modi కేవలం గంటసేపు మాత్రమే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్నారు. ఈ క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులకి ప్రత్యేక వాహనంలో తిరుగుతూ అభివాదం చేసిన మోడీ.. ఓ అరగంట సేపు మ్యాచ్‌ని వీక్షించారు. కానీ.. చివరికి నిరాశతో స్టేడియం నుంచి వెలుపలికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దానికి కారణం తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 9 Mar 2023, 2:09 pm

ప్రధానాంశాలు:

  • అహ్మదాబాద్ టెస్టుని వీక్షించేందుకు స్టేడియానికి మోడీ
  • క్రికెట్ స్టేడియంలో సుమారు గంటసేపు ఉన్న భారత ప్రధాని
  • భారత కెప్టెన్ రోహిత్ శర్మకి క్యాప్ అందజేసిన పీఎం
  • మ్యాచ్ మొదలైన అరగంటలోనే... స్టేడియం వెలుపలికి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu PM Modi,  Ahmedabad Test
అహ్మదాబాద్ టెస్టుకి హాజరైన మోడీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టుని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కేవలం అరగంట సేపు మాత్రమే వీక్షించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వగా.. ప్రధాని మోడీ(PM Modi)తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ కూడా మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. ఇద్దరూ కలిసి మ్యాచ్‌ టాస్‌కి ముందు మైదానంలో ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రేక్షకులు అభివాదం చేశారు.
వాస్తవానికి నరేంద్ర మోడీ, ఆంటోనీ ఆల్బనీస్‌ ఇరు జట్ల కెప్టెన్లతో కలిసి టాస్ ఎగురవేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని కాసేపు మ్యాచ్ కామెంట్రీ కూడా చెప్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ.. ఇద్దరూ టాస్‌కి ముందు మైదానంలోకి వచ్చారు.. ఆ తర్వాత గ్యాలరీలో కూర్చుని కాసేపు మ్యాచ్‌ని వీక్షించారు. మ్యాచ్ మొదలైన అరగంట తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం నుంచి వెలుపలికి వెళ్లిపోయారు.

మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ జట్టుకి.. మోడీ స్టేడియంలో ఉన్నప్పుడే ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ తీసే ఛాన్స్ వచ్చింది. కానీ.. వికెట్ కీపర్ కేఎస్ భరత్ కారణంగా ఆ వికెట్ చేజారింది. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ని భరత్ నేలపాలు చేశాడు. దాంతో మోడీ నిరాశగానే స్టేడియం వెలుపలికి వెళ్లారు. మ్యాచ్‌కి ముందు భారత్ ఆటగాళ్లని మోడీకి కెప్టెన్ రోహిత్ శర్మ పరిచయం చేయగా.. రోహిత్‌కి టీమిండియా టెస్టు క్యాప్‌ని మోడీ అందజేశారు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.