యాప్నగరం

దులీప్ ట్రోఫీ ఫైనల్లో పృథ్వీ షా రికార్డు

ముంబైకి చెందిన యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీ ఫైనల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

TNN 26 Sep 2017, 12:32 pm
ముంబైకి చెందిన యువ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి సత్తా చాటాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఇండియా రెడ్ తరఫున బరిలో దిగిన షా 154 పరుగులు చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సచిన్ తర్వాత ఈ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు షా కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో రంజీల్లోకి అడుగుపెట్టిన షా.. 17 ఏళ్ల 57 రోజుల వయసులో తాను ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన ముంబై ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ 18 ఏళ్ల వచ్చే సరికే రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల్లో శతకాలు బాదాడు.
Samayam Telugu prithvi shaw breaks sachin tendulkars record
దులీప్ ట్రోఫీ ఫైనల్లో పృథ్వీ షా రికార్డు


ముంబైలో జరిగిన స్కూల్ మ్యాచ్‌లో 330 బంతుల్లోనే 546 పరుగులు చేసిన పృథ్వీ షా.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఏ ఫార్మాట్లోనైనా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షా రికార్డులకెక్కాడు. హారిస్ షీల్డ్‌లో భాగంగా.. రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరఫున బరిలో దిగిన షా.. 14 ఏళ్ల వయసులో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌పై ఈ రికార్డు నెలకొల్పాడు. గతంలో సచిన్ కూడా ఇదే టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు 85 ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.