యాప్నగరం

​ పాక్‌పై శతకం బాదిన శుభమన్ చిలిపి

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత యువ బ్యాట్స్‌మెన్ శుభమన్

TNN 31 Jan 2018, 3:10 pm
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత యువ బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్ మైదానం వెలుపల చాలా చిలిపిగా ఉంటాడని కెప్టెన్ పృథ్వీ షా వెల్లడించాడు. టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో శుభమన్ గిల్ (102 నాటౌట్: 94 బంతుల్లో 7x4) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ పేలవ రీతిలో 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలిపోయింది. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో శనివారం జరగనుంది.
Samayam Telugu prithvi shaw shubman gill is a prankster
​ పాక్‌పై శతకం బాదిన శుభమన్ చిలిపి


‘శుభమన్ గిల్ మైదానంలో చాలా ఏకాగ్రతగా బ్యాటింగ్ చేస్తాడు.. ఫీల్డింగ్‌లోనూ ఎక్కువ చురుకుగా ఉంటాడు. కానీ.. మైదానం వెలుపల మాత్రం చాలా సరదాగా అందరినీ ఆటపట్టిస్తుంటాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లూ మెరుగ్గా రాణించారు. శనివారం జరగనున్న ఫైనల్ కోసం ఆసక్తిగా జట్టు మొత్తం ఎదురుచూస్తోంది’ అని కెప్టెన్ పృథ్వీ షా వెల్లడించాడు. ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న శుభమన్ గిల్ గత ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 147, 66, 63, 90, 86, 102 పరుగులు చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.