యాప్నగరం

టీ బ్రేక్‌లోపే ముగించారు.. థ్యాంక్స్: పుజారా

చివరి రోజు మ్యాచ్‌ను త్వరగా ముగించినందుకు పుజారా.. అశ్విన్, జడేజాకు థ్యాంక్స్ చెప్పాడు.

TNN 13 Feb 2017, 8:21 pm
చివరి రోజు ఏడు వికెట్లు కూల్చాల్సి ఉండటంతో హైదరాబాద్ టెస్టులో బంగ్లాపై టీమిండియా విజయం సాధించడం ఖాయమని నాలుగో రోజే తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కొద్దిలో సెంచరీ మిస్సయినా షకీబుల్ హసన్ క్రీజులో ఉండటం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతకం బాదిన కెప్టెన్ ముష్ఫికర్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో.. చివరి రోజు బంగ్లా కడదాకా పోరాడుతుందేమో అనుకున్నారు. కానీ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో నాలుగు వికెట్లు తీసి భారత్‌కు మధ్యాహ్నానికే విజయాన్ని ఖాయం చేశారు.
Samayam Telugu pujara thanked indian bolwers ashwin and jadeja
టీ బ్రేక్‌లోపే ముగించారు.. థ్యాంక్స్: పుజారా


దీంతో త్వరగా మ్యాచ్‌ను ముగించినందుకు చటేశ్వర పుజారా అశ్విన్, జడేజాకు థ్యాంక్స్ చెప్పాడు. బౌలర్లు తొందరగా మ్యాచ్ ముగించినందుకు గర్వంగా ఉందన్నాడు. పుజారాకు బౌలర్లపై ఇంత ప్రేమ ఎందుకో తెలుసా? ఆదివారం పుజారా పెళ్లి రోజు. 2013లో సరిగ్గా ఇదే రోజున పుజారాకు పెళ్లయ్యింది. పెళ్లి రోజు సందర్భంగా.. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు పుజారా ఈ రకంగా థ్యాంక్స్ చెప్పాడు. ఎవరి తొందర వారిది బాస్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.