ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మూడో రోజు టీమిండియా.. 99 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 303 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. అనంతరం ఆట మొదలవగానే.. కరుణ్ నాయర్ (23; 47 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. 107వ ఓవర్లో హేజిల్వుడ్ వేసిన 4వ బంతిని ఆడబోయి అతడు క్లీన్బౌల్డ్ అయ్యాడు. కరుణ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ కూడా ఎంతోసేపు నిలవలేదు. అతడు కేవలం 3 (22 బంతుల్లో) పరుగులే చేసి కమిన్స్ బౌలింగ్లో వేడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా క్రీజులోకి వచ్చాడు. ఒకవైపు వికెట్లన్నీ పడిపోతున్నా.. ఛతేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్లను అడ్డుకొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నాడు.
ప్రస్తుతం భారత్.. 126 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఛతేశ్వర్ పుజారా 128 (320 బంతుల్లో, 17×4), వృద్ధిమాన్ సాహా 11 (26 బంతుల్లో, 2×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. పాల్ కమిన్స్ 4 వికెట్లు తీసి ఆసిస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఒకీఫే, హేజిల్వుడ్కు తలో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా స్కోర్ను సమం చేయడానికి భారత్.. మరో 104 పరుగులు చేయాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్.. 126 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఛతేశ్వర్ పుజారా 128 (320 బంతుల్లో, 17×4), వృద్ధిమాన్ సాహా 11 (26 బంతుల్లో, 2×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. పాల్ కమిన్స్ 4 వికెట్లు తీసి ఆసిస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఒకీఫే, హేజిల్వుడ్కు తలో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా స్కోర్ను సమం చేయడానికి భారత్.. మరో 104 పరుగులు చేయాల్సి ఉంది.