యాప్నగరం

జడేజా, అశ్విన్‌కి రెస్ట్.. కుర్రాళ్లకి ఛాన్స్..?

శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ నుంచి స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌కి భారత సెలక్టర్లు విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉన్నారా

TNN 10 Aug 2017, 8:14 pm
శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ నుంచి స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌కి భారత సెలక్టర్లు విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉన్నారా..? శనివారం నుంచి లంకతో మూడో టెస్టు ఆడనున్న భారత్.. అనంతరం ఆగస్టు 20 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం సెలక్టర్లు జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మళ్లీ శ్రీలంకతో సుదీర్ఘ సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో సీనియర్లకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
Samayam Telugu r ashwin ravindra jadeja likely to be rested
జడేజా, అశ్విన్‌కి రెస్ట్.. కుర్రాళ్లకి ఛాన్స్..?


టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించిన స్పిన్నర్ జడేజా, అశ్విన్‌తో పాటు.. పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఇటీవల భారత్- ఎ జట్టులో సత్తాచాటిన చాహల్, అక్షర్ పటేల్, క్రునాల్ పాండ్య‌లను పరీక్షించాలని సెలక్టర్లు ఆశిస్తున్నారు. వన్డే, టీ20లు కూడా ఈ సీనియర్లు ఆడితే.. పనిభారం పెరుగుతుందని దాని ప్రభావం రానున్న సిరీస్‌ల్లో ప్రదర్శనపై పడుతుందని వారు భావిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం.. తనకి రెస్ట్ అవసరం లేదని చెప్పినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.