యాప్నగరం

బంతిపై ఉమ్ము రుద్దకూడదన్నా ప్రాక్టీస్ కావాల్సిందే: అశ్విన్

టెస్టుల్లో వినియోగించే ఎరుపు బంతి పాతబడినా.. కొంత మంది ఫాస్ట్ బౌలర్లు దాన్ని నుంచి మెరుగ్గా స్వింగ్ రాబట్టగలుగుతున్నారు. దానికి కారణం బంతిపై తరచూ ఉమ్ము రుద్దుతూ మెరుపు కాపాడటమే..!

Samayam Telugu 21 May 2020, 7:59 am
కరోనా వైరస్ కారణంగా బంతిపై ఆటగాళ్లు ఉమ్ము లేదా చెమటని ఇకపై రుద్దకూడదని ఇటీవల ఐసీసీ క్రికెట్ కమిటీ ఓ నిబంధనని ప్రతిపాదించింది. టెస్టు ఫార్మాట్‌లో ఎరుపు బంతి మెరుపుని కాపాడుకునేందుకు బౌలర్లు, ఫీల్డర్లు తరచూ దానిపై ఉమ్ము వేసి రుద్దేవారు. దాంతో బంతి పాతబడినా.. ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ రాబట్టగలిగేవారు. కానీ.. ఇకపై అలా ఉమ్ము రుద్దితే కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న ఐసీసీ.. ఆ అలవాటుని మానుకోవాలని ఆటగాళ్లకి సూచిస్తోంది.
Samayam Telugu Ravichandran Ashwin


వాస్తవానికి బంతిపై ఉమ్ము లేదా చెమటని రాయడం అనేది ఆనాదిగా వస్తోంది. దాంతో.. క్రికెటర్లకి మ్యాచ్‌ల్లో అదొక అలవాటుగా మారిపోయింది. కీపర్ నుంచి బంతిని అందుకున్న ఫీల్డర్.. దాన్ని బౌలర్‌కి ఇచ్చే ముందు ఉమ్ము లేదా చెమటని పదే పదే రుద్దడం కామన్‌. ఒకవేళ ఫీల్డర్ మర్చిపోయినా.. స్వయంగా బౌలరే ఆ పని చేస్తుంటాడు. మొత్తంగా.. బౌలింగ్ టీమ్‌కి దశాబ్దకాలంగా అదొక అలవాటుగా మారిపోయింది. దాంతో.. వెంటనే దాన్ని మానుకోవాలంటే కష్టమని భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Read More: టీ20 వరల్డ్‌కప్ డౌట్.. ఐపీఎల్‌ 2020పై అప్పుడే క్లారిటీ: గైక్వాడ్

‘‘బంతిపై ఉమ్ముని రుద్దడం మ్యాచ్ టైమ్‌లో నేను సహజంగా చేసే పని. అందుకే.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ పని చేయకుండా నన్ను నేను నియంత్రించుకోవడం కష్టమే. ఉమ్ముని రుద్దకుండా ఉండేందుకు కొంత ప్రాక్టీస్ అవసరం’’ అని అశ్విన్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా గత ఏడాది విఫలమైన అశ్విన్‌.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి మారిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.