యాప్నగరం

రహానె మూడో ఓపెనర్.. కానీ చోటివ్వలేం

వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్‌ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో

TNN 19 Aug 2017, 8:25 pm
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే‌లో ఢీకొనే భారత్ తుది జట్టు ఎంపికపై ఒకింత స్పష్టత వచ్చింది. దంబుల్లా వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శనివారం రాత్రి మీడియాతో మాట్లాడాడు. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా సత్తాచాటిన అజింక్య రహానె తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమవ్వచ్చని కోహ్లి పరోక్షంగా వెల్లడించాడు.
Samayam Telugu rahane understands hes the third opener in the team virat kohli
రహానె మూడో ఓపెనర్.. కానీ చోటివ్వలేం


‘వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్‌ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో ఓపెనర్‌గా ఉన్నాడు. కానీ.. అతను ఈ పోటీని అర్థం చేసుకుంటాడు. వెస్టిండీస్ పర్యటనలో రహానె అద్భుతంగా రాణించాడు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరు ఫామ్‌ని నిలకడగా కొనసాగిస్తున్నారో వారికే అవకాశాలిస్తాం. జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత.. ధావన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ.. పునరాగమనం నుంచి ఒంటిచేత్తో భారత్‌కి విజయాలని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అతని గణాంకాలే దీనికి నిదర్శనం. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే.. గాయపడక ముందు అతను మూడు ఫార్మాట్‌లో రెగ్యులర్ ఆటగాడు. కానీ.. అతను దూరమైన తర్వాత మనీశ్ పాండే జట్టులోకి వచ్చాడు. ఏది ఏమైనా తొలి వన్డేలో సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగుతాం’ అని కోహ్లి స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.