శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం రాత్రి ముగిసిన మూడో టీ20 మ్యాచ్లో భారత స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్లో అదరగొట్టేశాడు. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టుని 81/8కే పరిమితం చేసిన లంకేయులు.. లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే 82/3తో ఛేదించేశారు. దాంతో.. మూడు టీ20ల సిరీస్ని 2-1తో శ్రీలంక చేజిక్కించుకుంది. శ్రీలంక చేజార్చుకున్న మూడు వికెట్లనీ రాహుల్ చాహరే పడగొట్టడం విశేషం. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రాహుల్ చాహర్ బౌలింగ్లో శ్రీలంక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (12: 18 బంతుల్లో 1x4).. బ్యాక్ఫుట్ పైకి వెళ్లి మరీ చాహర్ పక్క నుంచి బంతిని హిట్ చేశాడు. దాంతో.. కొద్దిగా గాల్లోకి లేచిన బంతిని.. ఎడమ వైపు ఫుల్ లెంగ్త్ డైవ్ చేసిన రాహుల్ చాహర్.. ఎవరూ ఊహించనిరీతిలో క్యాచ్గా అందుకున్నాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మినోద్ భానుక (18: 27 బంతుల్లో 1x4)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న రాహుల్ చాహర్.. సమరవిక్రమ (6: 13 బంతుల్లో)ని క్లీన్ బౌల్డ్ చేసేశాడు. చాహర్ విసిరిన బంతిని సమరవిక్రమ కనీసం అడ్డుకోలేకపోయాడు. ఈ మ్యాచ్తో లంక గడ్డపై భారత్ పర్యటన ముగిసింది.
Rahul Chahar స్టన్నింగ్ క్యాచ్.. బ్యాక్ఫుట్ మీదకి వెళ్లి మరీ ఓపెనర్ బోల్తా
మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 81 పరుగులకే పరిమితవగా.. ఓటమి ఖాయమైపోయింది. అయినప్పటికీ.. గొప్ప పోరాట పటిమని కనబర్చిన రాహుల్ చాహర్ స్టన్నింగ్ క్యాచ్తో అదరగొట్టేశాడు.
Samayam Telugu 30 Jul 2021, 8:51 am
ప్రధానాంశాలు:
- శ్రీలంకపై ఆఖరి టీ20లో చాహర్ స్టన్నింగ్ క్యాచ్
- మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిన భారత్
- మూడు టీ20ల సిరీస్ని గెలిచిన శ్రీలంక
- మూడు వికెట్లు పడగొట్టిన రాహుల్ చాహర్