శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టుకి శుభారంభం లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (35: 37 బంతుల్లో 5x4, 1x6) నిరాశపరిచినా.. నాలుగు నెలలు తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (52 నాటౌట్: 73 బంతుల్లో 7x4) అర్ధశతకంతో రాణించాడు. దీంతో భారత్ తొలి సెషన్ ముగిసే సమయానికి 28 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. రాహుల్తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (14 నాటౌట్: 58 బంతుల్లో 1x4) క్రీజులో ఉన్నాడు.
ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా గాలె టెస్టుకి దూరమైన కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించడంతో.. ఓపెనర్ అభినవ్ ముకుంద్పై వేటు పడింది. తొలి టెస్టులో 190 పరుగులతో సత్తాచాటిన శిఖర్ ధావన్ తొలి సెషన్ ఆరంభంలోనే దూకుడుగా ఆడినా.. జట్టు స్కోరు 56 వద్ద పెరీరా బౌలింగ్లో స్వీప్ షాట్కి ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన పుజారాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కి అజేయంగా 107 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
India reached 101 at Lunch on the back of the India opener's sixth successive Test fifty
ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా గాలె టెస్టుకి దూరమైన కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించడంతో.. ఓపెనర్ అభినవ్ ముకుంద్పై వేటు పడింది. తొలి టెస్టులో 190 పరుగులతో సత్తాచాటిన శిఖర్ ధావన్ తొలి సెషన్ ఆరంభంలోనే దూకుడుగా ఆడినా.. జట్టు స్కోరు 56 వద్ద పెరీరా బౌలింగ్లో స్వీప్ షాట్కి ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన పుజారాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కి అజేయంగా 107 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
India reached 101 at Lunch on the back of the India opener's sixth successive Test fifty