యాప్నగరం

IPL 2020: కరోనా టెన్షన్.. పీపీఈ కిట్లతో రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు భారత్‌ నుంచి ఒక్కో ఐపీఎల్ టీమ్ బయల్దేరి వెళ్తున్నాయి. ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అక్కడికి వెళ్లారు.

Samayam Telugu 20 Aug 2020, 8:19 pm
ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈకి గురువారం నుంచి టోర్నీలోని టీమ్స్‌ బయల్దేరి వెళ్తున్నాయి. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. కనీసం నెల రోజుల ముందు టీమ్స్‌ని అక్కడికి పంపాలని ఫ్రాంఛైజీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. దాంతో.. ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లని అక్కడికి పంపాయి.
Samayam Telugu Rajasthan Royals Players



మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరాన్ని పాటిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు యూఏఈకి బయల్దేరగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రికెటర్లు మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ ఏకంగా పీపీఈ కిట్లు ధరించి మరీ యూఏఈ విమానం ఎక్కారు. రాజస్థాన్ టీమ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్, ఓపెనర్ రాబిన్ ఉతప్ప తదితరులు పీపీఈ కిట్లు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఐపీఎల్ 2020 సీజన్‌‌ 53 రోజులు జరగనుండగా.. మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించేందుకు బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్‌ ప్రకటించింది. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. యూఏఈకి ఆటగాళ్లని పంపే ముందు రెండు సార్లు వారికి కరోనా వైరస్ పరీక్షల్ని ఫ్రాంఛైజీలు నిర్వహించనుండగా.. యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత ఒకటి.. 14 రోజుల క్వారంటైన్‌లో రెండు సార్లు పరీక్షలు చేయనున్నారు. మొత్తంగా.. టోర్నీ ఆరంభానికి ముందు ఐదు సార్లు ప్రతి క్రికెటర్‌కి కరోనా టెస్టులు చేస్తారు. అన్నింటిలోనూ నెగటివ్ వచ్చిన వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చి.. టోర్నీ ముగిసే వరకూ ఆ బబుల్‌ నుంచి వారిని వెలుపలికి అనుమతించరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.