యాప్నగరం

నిలకడగా సాగుతున్న ఇండియన్ ఇన్నింగ్స్

రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.

TNN 18 Mar 2017, 1:43 pm
రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (67), మురళీ విజయ్‌ (82) అర్ధశతకాలతో రాణించగా.. ఛతేశ్వర్‌ పుజారా కూడా తన టెస్టు కెరీర్‌లో 15వ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్‌ నిష్క్రమణతో బ్యాటింగ్‌కు దిగిన ఈ టీమిండియా నయావాల్‌.. ఒకీఫె వేసిన 74వ ఓవర్ చివరి బంతిని ఓ చక్కని కవర్‌ డ్రైవ్‌తో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా తరలించి.. బౌండరీతో అర్ధ శతకం పూర్తి చేశాడు.
Samayam Telugu ranchi test virat kohli falls to pat cummins after cheteshwar pujaras half century
నిలకడగా సాగుతున్న ఇండియన్ ఇన్నింగ్స్


మరో వైపు గాయంతో నిన్న పెవీలియన్‌కే పరితమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‌ చేస్తాడో లేదో అనే అనుమానాలకు తెర దించుతూ విజయ్ ఔటవగానే క్రీజులోకి వచ్చాడు. విరాట్.. మైదానంలోకి అడుగుపెట్టగానే ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానులు పెద్దగా అరిచారు. అతడు జాగ్రత్తగా ఆడుతూ.. క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నించినప్పటికీ.. మరో సారి తక్కువ స్కోర్‌కే (23 బంతుల్లో 6) ఔటై అభిమానులను నిరాశ పరిచాడు. ఆ తర్వాత ఆజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు.

ప్రస్తుతం 89 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఛతేశ్వర్‌ పుజారా 90 (200 బంతుల్లో, 12×4), రహానే 13 (26 బంతుల్లో, 2×4), పరుగులతో ఇండియన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఆస్ట్రేలియా కంటే భారత్.. 188 పరుగులు వెనకబడి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.