యాప్నగరం

ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌తో శుభమన్ గిల్ గొడవ.. ప్రత్యర్థి టీమ్ వాకౌట్

ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అంపైర్‌ తనని ఔటివ్వగానే సహనం కోల్పోయిన శుభమన్ గిల్.. అతనితో గొడవకి దిగాడు. అంతేకాకుండా.. తాను క్రీజు వదిలి వెళ్లనని మొండికేయడంతో.. ఫీల్డింగ్ చేస్తున్న ప్రత్యర్థి టీమ్ మైదానం వెలుపలికి వెళ్లిపోయింది.

Samayam Telugu 3 Jan 2020, 2:07 pm
భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ మైదానంలో సహనం కోల్పోయాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్‌ టీమ్ తరఫున ఆడుతున్న శుభమన్ గిల్.. ఢిల్లీతో మొహాలి వేదికగా జరుగుతున్న రౌండ్-4 మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడ్డాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ సన్వీర్ సింగ్‌తో కలిసి శుభమన్ గిల్ (23: 41 బంతుల్లో 4x4) ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు.
Samayam Telugu Shubman Gill


పంజాబ్ స్కోరు 60 వద్ద సిమర్‌‌జీత్ సింగ్ బౌలింగ్‌లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన
శుభమన్ గిల్.. వికెట్ కీపర్ అంజు రావత్‌ చేతికి దొరికిపోయాడు. బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. కానీ.. ఈ ఔట్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన శుభమన్ గిల్.. ఫీల్డ్ అంపైర్‌తో గొడవకి దిగాడు. దీంతో.. మైదానంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

ఆ మ్యాచ్‌ని కవర్ చేసేందుకు వెళ్లిన స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఫీల్డ్ అంపైర్‌‌తో గొడవపడిన శుభమన్ గిల్.. అసభ్య పదాలతో దూషించినట్లు ఢిల్లీ టీమ్ వైస్ కెప్టెన్ నితీశ్ రాణా వెల్లడించాడు. గిల్, అంపైర్ మధ్య వాగ్వాదం కొనసాగుతుండటంతో.. అసహనానికి గురైన ఢిల్లీ టీమ్ మైదానం వెలుపలికి వెళ్లిపోయినట్లు సమాచారం. టోర్నీలో ఈ మ్యాచ్‌ ముందు వరకూ మూడు మ్యాచ్‌లాడిన శుభమన్ గిల్ 150 పరుగులు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.