యాప్నగరం

Ranji Trophy‌లో కొత్త విజేత మధ్యప్రదేశ్.. ముంబయికి ఊహించని పంచ్

Ranji Trophy Finalలో మధ్యప్రదేశ్ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠగా ముగిసిన ఈ మ్యాచ్‌లో ముంబయి టీమ్ చివరి వరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. మధ్యప్రదేశ్‌కి ఇదే ఫస్ట్ రంజీ టైటిల్.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 26 Jun 2022, 3:54 pm

ప్రధానాంశాలు:

  • రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్
  • ఫైనల్లో ముంబయికి ఊహించని పంచ్
  • నాలుగు సెంచరీలు నమోదు
  • ఈరోజు ఉత్కంఠగా ముగిసిన టైటిల్ పోరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Madhya Pradesh (Pic Source: Twitter)
రంజీ ట్రోఫీలో దిగ్గజంగా పేరొందిన ముంబయికి ఈరోజు మధ్యప్రదేశ్ ఊహించని పంచ్ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ 2021-22 ఫైనల్లో ముంబయిపై 6 తేడాతో గెలిచిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముంబయి ఇప్పటికే ఏకంగా 41 సార్లు ఈ రంజీ ట్రోఫీలో విజేతగా నిలవడం గమనార్హం.

బుధవారం ప్రారంభమైన ఈ ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 127.4 ఓవర్లలో 374 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (134: 243 బంతుల్లో 13x4, 2x6) సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన మధ్యప్రదేశ్ టీమ్ 177.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 536 పరుగులు చేసింది. ఆ టీమ్ ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఓపెనర్ యశ్ దుబె (133: 336 బంతుల్లో 14x4)తో పాటు శుభమ్ శర్మ (116: 215 బంతుల్లో 15x4, 1x6),రజత్ పాటిదార్ (122: 219 బంతుల్లో 20x4) శతకాలు బాదేశారు. దాంతో.. మధ్యప్రదేశ్ టీమ్‌కి 162 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

162 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన ముంబయి టీమ్‌లో సువేద్ పరాకర్ (51: 58 బంతుల్లో 3x4, 1x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సర్ఫరాజ్ ఖాన్ (45: 48 బంతుల్లో 2x4, 1x6) క్రీజులో నిలిచాడు. కానీ.. జట్టుని ఆదుకోలేకపోయాడు. మొత్తంగా.. ముంబయి టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. దాంతో.. కేవలం 108 పరుగుల టార్గెట్ మాత్రమే మధ్యప్రదేశ్ ముందు నిలిచింది. ఛేదనలో మధ్యప్రదేశ్ తొలుత కాస్త తడబడినా.. 4 వికెట్లు కోల్పోయి 29.5 ఓవర్లలోనే ఛేదించేసి విజేతగా నిలిచింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.