పేలవ ప్రదర్శనతో టీమిండియాలో స్థానం కోల్పోయిన స్పిన్నర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్లో ఒంటిచేత్తో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టుని గెలిపించాడు. తొలుత బ్యాట్తో డబుల్ సెంచరీ బాదిన జడేజా (201: 313 బంతుల్లో 23x4, 2x6) అనంతరం బంతితో చెలరేగి.. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టడంతో జమ్మూ కాశ్మీర్పై 212 పరుగుల తేడాతో సౌరాష్ట్ర గెలుపొందింది.
శనివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో జడేజాతో పాటు.. జాక్సన్ (181) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 624/7 వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్మూకాశ్మీర్ జట్టు జడేజా (4/40) ధాటికి 156 పరుగులకే కుప్పకూలిపోయింది. 468 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ జడేజా (3/69), వందిత్ (6/79) విజృంభనతో 256 పరుగులకి ఆలౌటైంది. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
శనివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో జడేజాతో పాటు.. జాక్సన్ (181) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 624/7 వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్మూకాశ్మీర్ జట్టు జడేజా (4/40) ధాటికి 156 పరుగులకే కుప్పకూలిపోయింది. 468 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ జడేజా (3/69), వందిత్ (6/79) విజృంభనతో 256 పరుగులకి ఆలౌటైంది. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.