యాప్నగరం

ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన జడేజా

పేలవ ప్రదర్శనతో టీమిండియా‌లో స్థానం కోల్పోయిన స్పిన్నర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లో ఒంటిచేత్తో తాను ప్రాతినిథ్యం

TNN 16 Oct 2017, 6:50 pm
పేలవ ప్రదర్శనతో టీమిండియా‌లో స్థానం కోల్పోయిన స్పిన్నర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లో ఒంటిచేత్తో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టుని గెలిపించాడు. తొలుత బ్యాట్‌తో డబుల్ సెంచరీ బాదిన జడేజా (201: 313 బంతుల్లో 23x4, 2x6) అనంతరం బంతితో చెలరేగి.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టడంతో జమ్మూ కాశ్మీర్‌పై 212 పరుగుల తేడాతో సౌరాష్ట్ర గెలుపొందింది.
Samayam Telugu ranji trophy all round jadeja fires saurashtra to big win
ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన జడేజా


శనివారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో జడేజాతో పాటు.. జాక్సన్ (181) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 624/7 వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్మూకాశ్మీర్ జట్టు జడేజా (4/40) ధాటికి 156 పరుగులకే కుప్పకూలిపోయింది. 468 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ జడేజా (3/69), వందిత్ (6/79) విజృంభ‌న‌తో 256 పరుగులకి ఆలౌటైంది. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.