యాప్నగరం

​ కరుణ్ నాయర్ 153.. కర్ణాటక 301 ఆలౌట్

రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ భారీ శతకంతో చెలరేగాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా

TNN 19 Dec 2017, 3:42 pm
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ భారీ శతకంతో చెలరేగాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా విదర్భ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ (153: 287 బంతుల్లో 8x4) సెంచరీ సాధించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది. అంతకముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 116 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కర్ణాటక జట్టు సాధించగలిగింది.
Samayam Telugu ranji trophy karnataka on top after karun nair hits ton against vidarbha
​ కరుణ్ నాయర్ 153.. కర్ణాటక 301 ఆలౌట్


అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విదర్భ 47 ఓవర్లు ముగిసే సమయానికి ఆటలో మూడో రోజైన మంగళవారం 195/4తో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 79 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉండగా.. కర్ణాటక బౌలర్లు వినయ్ కుమార్, స్టువర్ట్ బిన్నీ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ సవాల్ విసురుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.