యాప్నగరం

మైదానంలోకి పాము.. నిలిచిన మ్యాచ్ (వీడియో)

విజయవాడ వేదికగా ఆంధ్రాతో రంజీ మ్యాచ్ జరుగుతుండగా.. విదర్భ టీమ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తున్నారు. కానీ.. సడన్‌గా గ్రౌండ్‌లోని విదర్భ క్రికెటర్లు.. ఒక్క పక్కకి పరుగెత్తడం మొదలెట్టారు. కారణం..?

Samayam Telugu 9 Dec 2019, 12:40 pm
క్రికెట్ మైదానంలోకి కుక్కలు, పిల్లిలు, తేనెటీగలు రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయిన సందర్భాలని మనం చూశాం. కానీ.. గ్రౌండ్‌లోకి పాము రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయిన అరుదైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా, విదర్భ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. సడన్‌గా మైదానంలోకి పాము దూసుకొచ్చింది. దీంతో.. ఫీల్డింగ్ చేస్తున్న విదర్భ క్రికెటర్లు మైదానంలో పరుగులు తీశారు.
Samayam Telugu Andhra vs Vidarbha
Photo credit: Screen grab from BCCI Twitter video



మైదానంలోకి పాము రావడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన గ్రౌండ్ సిబ్బంది దాన్ని వెలుపలకి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో.. కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. తాజాగా పాము గ్రౌండ్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులు కామెడీగా స్పందిస్తున్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ టీమ్ కెప్టెన్ ఫజల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆంధ్రా జట్టు 32 ఓవర్లు ముగిసే సమయానికి 87/3తో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హనుమ విహారి (43 నాటౌట్), వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (13నాటౌట్) ఉండగా.. ఓపెనర్లు గణేశ్వర్ (8), ప్రశాంత్ కుమార్ (10) నిరాశపరిచారు. వీరి తర్వాత వచ్చిన రికీ భుయ్ (9) కూడా పేలవంగా వికెట్ చేజార్చుకున్నా.. అనంతరం వచ్చిన హనుమ విహారి నిలకడగా ఆడుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.