బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 వికెట్ల నష్టానికి 45 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 145 పరుగుల లక్ష్య చేధనలో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. తొలి సెషన్లోనే 3 వికెట్లు పడటంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ రవిచంద్రన్ అశ్విన్ (46), శ్రేయస్ అయ్యర్ (29) టీమిండియాను గెలిపించారు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు అజేయంగా 71 పరుగులు జోడించడంతో ఢాకా టెస్టులో భారత్ విజయ ఢంకా మోగించింది. అద్భుత పోరాటంతో టీమిండియాను గెలిపించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్గా నిలవగా.. ఈ ఆల్రౌండర్పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతమైన విజయం అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం జయదేవ్ ఉనద్కత్ ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేయగా.. దాన్ని అశ్విన్ రీట్వీట్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో దిగిన ఫొటోను అశ్విన్ ట్వీట్ చేయగా.. అభిమానులు సానుకూలంగా స్పందించారు. కానీ ఓ నెటిజన్ మాత్రం రవిచంద్రన్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నించగా.. అది మిస్ ఫైర్ అయ్యింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నువ్వు కచ్చితంగా మోమినుల్ హక్కు అందించాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చిన తేలికైన క్యాచ్ను అతడు వదిలేశాడు. అతడు క్యాచ్ అందుకొని ఉండుంటే భారత్ కచ్చితంగా 89 పరుగులకే ఆలౌటై ఉండేది’ అని నిబ్రాజ్ రంజాన్ అనే శ్రీలంకన్ అశ్విన్ ట్వీట్కు కామెంట్ చేశాడు.
దానికి స్టార్ ఆల్రౌండర్ ఘాటుగా బదులిచ్చాడు. పనిలో పనిగా ఎప్పడూ భారత్ మీద పడి ఏడ్చే డానియెల్ అలెగ్జాండర్ అనే శ్రీలంకేయుడికి కూడా అశ్విన్ చురకలు అంటించాడు. ‘నేను నిన్ను బ్లాక్ చేశానని అనుకున్నానే.. సారీ అతడు మరో వ్యక్తి. అతడి పేరేంటి..? హా.. డానియెల్ అలెగ్జాండర్. ఒక వేళ భారత్ క్రికెట్ ఆడకపోయి ఉండుంటే.. మీరేం చేసేవాళ్లో ఊహించుకోండి’ అంటూ అశ్విన్ సెటైరికల్గా రిప్లయ్ ఇచ్చాడు. అశ్విన్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లయ్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. గూగ్లీ అదిరింది అంటూ ఆఫ్ స్పిన్నర్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మైదానంలోనే కాదు బయట కూడా అశ్విన్ను ఎదుర్కోవడం కష్టమంటూ కితాబిస్తున్నారు.
ఢాకా టెస్టులో భారత్ను గెలిపించిన అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత 3 వేలకుపైగా పరుగులు 400కిపైగా వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నువ్వు కచ్చితంగా మోమినుల్ హక్కు అందించాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చిన తేలికైన క్యాచ్ను అతడు వదిలేశాడు. అతడు క్యాచ్ అందుకొని ఉండుంటే భారత్ కచ్చితంగా 89 పరుగులకే ఆలౌటై ఉండేది’ అని నిబ్రాజ్ రంజాన్ అనే శ్రీలంకన్ అశ్విన్ ట్వీట్కు కామెంట్ చేశాడు.
ఢాకా టెస్టులో భారత్ను గెలిపించిన అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత 3 వేలకుపైగా పరుగులు 400కిపైగా వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.