యాప్నగరం

2019 వరల్డ్‌కప్ ఆడాలని ఉంది: అశ్విన్

ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచప్‌లో తనకి ఆడాలని ఉందని భారత ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. మణికట్టు స్పిన్నర్లు

Samayam Telugu 29 Jun 2018, 7:04 pm
ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచప్‌లో తనకి ఆడాలని ఉందని భారత ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు భారత జట్టులో మెరుగ్గా రాణిస్తుండటంతో గత ఏడాదికాలంగా టీమిండియా వన్డే, టీ20 జట్టుకి దూరమైన అశ్విన్ కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే.. భారత సెలక్టర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకి అవకాశమిస్తే సత్తా నిరూపించుకుంటానని ఈ 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు.
Samayam Telugu ravichandran ashwin hopes to play in 2019 world cup
2019 వరల్డ్‌కప్ ఆడాలని ఉంది: అశ్విన్


‘భారత జట్టులోకి ఎంపిక అనేది నా చేతుల్లో లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్, సెలక్టర్ల నిర్ణయంపై అది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను ఎంపిక గురించి ఆలోచించే కంటే.. ఆటని ఆస్వాదించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నా. కానీ.. భారత జెర్సీ ధరించి మళ్లీ ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది. ఒకవేళ అవకాశం దొరికితే.. తప్పకుండా రెండు చేతులా వినియోగించుకుంటా’ అని అశ్విన్ వెల్లడించాడు. భారత్ తరఫున వన్డే‌ని చివరిసారిగా జూన్ 2017న వెస్టిండీస్‌పై అశ్విన్ ఆడాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.