యాప్నగరం

​ అశ్విన్, జడేజా.. మీరు ఇక మర్చిపోండి..!

భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు.. తాము 2019 ప్రపంచకప్ ఆడాలనే ఆశను వదిలేయాని

TNN 15 Feb 2018, 1:33 pm
భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు.. తాము 2019 ప్రపంచకప్ ఆడాలనే ఆశను వదిలేయాని భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ సూచించాడు. ప్రస్తుతం వన్డే, టీ20 జట్టులో మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌లు మెరుగ్గా రాణిస్తున్నారని.. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరైనా గాయపడితే తప్ప సీనియర్ స్పిన్నర్లకి మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కకపోవచ్చని ఆయన వివరించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఐదు వన్డేలు ముగియగా.. చాహల్, కుల్దీప్ ఇద్దరూ కలిసి 30 వికెట్లు పడగొట్టి భారత్ జట్టు 4-1తో సిరీస్ గెలవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆరో వన్డే శుక్రవారం జరగనుంది.
Samayam Telugu ravichandran ashwin ravindra jadeja unlikely to make it to indias world cup 2019 squad atul wassan
​ అశ్విన్, జడేజా.. మీరు ఇక మర్చిపోండి..!


‘టీమిండియా వన్డే, టీ20 జట్టులో మళ్లీ అశ్విన్, జడేజాలకి చోటు దక్కుతుందని చాలా మంది గౌరవంగా చెప్తున్నారు. కానీ.. ఆ సూచనలేవీ నాకు కనిపించడం లేదు. ఒకవేళ చాహల్ లేదా కుల్దీప్ గాయపడితే వారికి అవకాశం దక్కొచ్చు. ప్రస్తుతానికైతే.. టీమిండియా మేనేజ్‌మెంట్ 2019 ప్రపంచకప్‌లోపు చాహల్, కల్దీప్‌లతో కనీసం 50-60 మ్యాచ్‌లు ఆడించేలా ప్లాన్ చేస్తోంది. ఈ మణికట్టు స్పిన్నర్లు కూడా.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి ఏ మాత్రం జంకకుండా ఊరిస్తూ ప్లైటెడ్ డెలివరీలు వేస్తూనే వికెట్లు పడగొడుతున్నారు ’వాసన్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.