బంతిని గిరగిరా తిప్పుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ని ముప్పుతిప్పలు పెట్టే భారత స్పిన్నర్ అశ్విన్ ఓ ఇబ్బందికర ప్రశ్నకు తనదైన రీతిలో బదులిచ్చాడు. బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అశ్విన్ ‘దిలీప్ సర్దేశాయ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ కావేరీ జలాల విషయమై అశ్విన్ను ఇబ్బందిపెట్టాలని చూశాడు. ‘కర్ణాటక నీటిలో ఏముంది అశ్విన్..? ఆ నీరు తాగి ఒకప్పుడు బీఎస్ చంద్రశేఖర్, ప్రసన్న, ఇప్పుడు నువ్వు ఇలా.. అత్యుత్తమ స్పిన్నర్లగా వెలుగులోకి వస్తున్నారు’ అని ప్రశ్నించాడు.
నిజానికి అశ్విన్ తమిళనాడుకు చెందిన క్రికెటర్. కానీ.. ఇటీవల కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదాలు చెలరేగిన నేపథ్యంలో అతణ్ని ఇబ్బంది పెట్టాలని ఫరూఖ్ ఇంజినీర్ ఈ ప్రశ్న సంధించాడు. దీంతో అశ్విన్ కాసేపు షాకైనా.. తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. ‘నేనిక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అయితే కావేరీ జలాలు ఈ మధ్య తమిళనాడుకు వస్తున్నాయి. నా వికెట్ల జోరుకు అది కూడా ఓ కారణమేమో’ అని బదులిచ్చాడు. అతడి సమాధానంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. ఫరూఖ్ ఇంజినీర్ ఆటలు ఇంజినీరింగ్ చదువుకున్న అశ్విన్ ముందు సాగలేదు.
నిజానికి అశ్విన్ తమిళనాడుకు చెందిన క్రికెటర్. కానీ.. ఇటీవల కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదాలు చెలరేగిన నేపథ్యంలో అతణ్ని ఇబ్బంది పెట్టాలని ఫరూఖ్ ఇంజినీర్ ఈ ప్రశ్న సంధించాడు. దీంతో అశ్విన్ కాసేపు షాకైనా.. తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. ‘నేనిక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అయితే కావేరీ జలాలు ఈ మధ్య తమిళనాడుకు వస్తున్నాయి. నా వికెట్ల జోరుకు అది కూడా ఓ కారణమేమో’ అని బదులిచ్చాడు. అతడి సమాధానంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. ఫరూఖ్ ఇంజినీర్ ఆటలు ఇంజినీరింగ్ చదువుకున్న అశ్విన్ ముందు సాగలేదు.