యాప్నగరం

సర్ జడేజా మీరు సూపర్ సర్‌జీ

ధర్మశాల టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రవీంద్ర జడేజా.. ఈ సీజన్లో అదరగొట్టాడు.

TNN 28 Mar 2017, 2:02 pm
ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌‌ను గెలుపొందిన భారత్ 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 106 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. తొలి టెస్టులో ఓడినప్పటికీ అసాధారణ రీతిలో పుంజుకున్న టీమిండియా.. బెంగళూరు టెస్టులో విజయం సాధించింది. ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసిన జడేజా.. బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన జడ్డూ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
Samayam Telugu ravindra jadeja wins mom and man of the series
సర్ జడేజా మీరు సూపర్ సర్‌జీ


ఒక టెస్టు మాత్రమే ఆడిన బంగ్లాదేశ్‌ సిరీస్ మినహాయిస్తే.. గత మూడు టెస్టు సిరీస్‌లలోనూ జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై కూడా జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. జడేజా టెస్టుల్లో ఏడు అర్ధ సెంచరీలు సాధించగా.. ఈ సీజన్లోనే ఆరు హాఫ్ సెంచరీలు బాదడం విశేషం.

ఈ సీజన్లో 13 టెస్టులు ఆడిన జడేజా.. 71 వికెట్లు తీయడంతోపాటు 556 పరుగులు చేశాడు. అశ్విన్ నుంచి వరల్డ్ నంబర్ వన్ టెస్టు బౌలర్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 464 పరుగులు చేసిన అశ్విన్ 82 వికెట్లు తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.