యాప్నగరం

కోహ్లీ పగ తీర్చుకున్నాడు.. ఆ నలుగురు ఆర్‌‌సీబీలోకి!

వేలంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూస్తే.. విరాట్ కోహ్లి పగ తీర్చుకున్నాడా? అనే అనుమానం రాకమానదు.

TNN 28 Jan 2018, 9:24 pm
ఐపీఎల్ వేలంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ పేరు చెప్పగానే పటిష్టమైన బ్యాటింగ్ విభాగం గుర్తొస్తుంది. ఇప్పటికే కోహ్లి, డివిలియర్స్ లాంటి విధ్వంసక హిట్టర్లు ఉండగా.. వీరికి తోడుగా మెక్‌కల్లమ్‌ చేరుతున్నాడు. దీంతో బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఈసారి వేలంలో ప్రధానంగా బౌలర్లపై దృష్టి సారించింది. ఉమేష్ యాదవ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, గ్రాండ్‌‌హోమ్, మహమ్మద్ సిరాజ్, టిమ్ సౌథీ లాంటి పేసర్లను జట్టులోకి తీసుకుంది. వీరి చేరికతో బెంగళూరు బౌలింగ్ విభాగం పటిష్టమైనట్లే.
Samayam Telugu rcb buy all 4 pacers who dismissed them for 49 in 58 balls
కోహ్లీ పగ తీర్చుకున్నాడు.. ఆ నలుగురు ఆర్‌‌సీబీలోకి!


మరికాస్త జాగ్రత్తగా గమనిస్తే పైన చెప్పిన పేసర్ల జాబితాలో తొలి నలుగురు గత ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడినవారే. హేమాహేమీల్లాంటి బ్యాట్స్‌మెన్ ఉన్న ఆర్‌సీబీ గత సీజన్లో బ్యాటింగ్‌లో తడబడింది. ముఖ్యంగా ఏప్రిల్ 23న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లోనైతే బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన గంభీర్ సేన 131 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బదులుగా బెంగళూరు 9.4 ఓవర్లలోనే 49 రన్స్‌కే కుప్పకూలింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో కోహ్లి డకౌట్ కాగా, రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కోల్‌కతా బౌలర్లు కౌల్టర్ నైల్, క్రిస్ వోక్స్, గ్రాండ్‌హోమ్ తలో మూడు వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

చదవండి: ఐపీఎల్ 8 జట్ల ఆటగాళ్ల వివరాలు..

ఏ బౌలర్ల చేతిలోనైతే ఆర్‌సీబీ దారుణంగా దెబ్బతిందో ఇప్పుడు ఈ బౌలర్లంతా బెంగళూరు టీంలో చేరిపోతున్నారు. ఇది యాదృచ్ఛికంగానే జరిగి ఉండొచ్చు. కానీ చెప్పుకోవడానికి మాత్రం ఆసక్తికరంగా ఉంది కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.