యాప్నగరం

నాలుగేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌‌లు

ప్రపంచకప్‌లో ఎక్కువ దేశాలు పోటీపడి.. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీస్

TNN 21 Jun 2017, 3:45 pm
ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ ఢీకొనడంతో ఐసీసీ ఊహించని స్థాయిలో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సూపర్ హిట్‌గా ముగిసింది. అంచనాలకి మించి ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించి ఐసీసీ పంట పండించారు. అయితే ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కాబోతోందని.. ఈ టోర్నీ స్థానంలో రెండు టీ20 ప్రపంచకప్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు.
Samayam Telugu replacing ct with two wt20s in four year cycle a possibility
నాలుగేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌‌లు


నాలుగేళ్లకి ఒక్కసారి జరిగే ఈ టోర్నీ 2021‌లో జరగాల్సి ఉంది. కానీ.. 2019 ప్రపంచకప్‌ని నిర్వహించి మళ్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలంటే కష్టం అవుతుందని సీఈవో అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో కనీసం రెండు టీ20 ప్రపంచకప్‌లు నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీలో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు. సుధీర్ఘంగా సాగే ప్రపంచకప్‌‌లు మేలని.. ఇందులో ఎక్కువ జట్లు కూడా పోటీపడతాయని రిచర్డసన్ పేర్కొన్నారు.

‘ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్‌ ఈ రెండు మెగా ఈవెంట్ల మధ్య తారతమ్యం తక్కువే. కాకపోతే ప్రపంచకప్‌లో ఎక్కువ దేశాలు పోటీపడి.. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీస్ చేరతాయి.. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షం, తక్కువ మ్యాచ్‌లు ఉండటంతో కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి చిన్న జట్లు సెమీస్ చేరుతుంటాయి. అందుకే ఈ టోర్నీని కొనసాగించాలా లేక నాలుగేళ్ల కాలంలో రెండు టీ20 ప్రపంచకప్‌లు నిర్వహించాలనే విషయమై ఐసీసీలో చర్చిస్తున్నాం. అదీగాక ఇటీవల టీ20ల క్రేజ్ బాగా పెరిగింది’ అని రిచర్డ్‌సన్ వివరించాడు.ఇప్పుడే కాదు.. గత కొన్నేళ్లుగా ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపివేయాలా లేదా కొనసాగించాలా..? అనే తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.