యాప్నగరం

ధోనీ రీప్లేస్ సులువు కాదు.. కానీ పంత్‌కి ఫుల్ సపోర్ట్: కోచ్ రాథోడ్

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. జులై నుంచి డిసెంబరు వరకూ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలిచ్చింది. కానీ.. అతను ఫెయిలయ్యాడు. దాంతో.. ఈ ఏడాది ఆరంభం నుంచి రాహుల్‌కి ఛాన్సిలిచ్చింది.

Samayam Telugu 27 Jun 2020, 4:18 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి ధోనీ దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి సెలక్టర్లు వరుస అవకాశాలిచ్చారు. అయితే.. పంత్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవగా.. కేఎల్ రాహుల్ ఎవరూ ఊహించనిరీతిలో క్లిక్ అయ్యాడు. కానీ.. రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ ఎక్కువ సపోర్ట్ ఇస్తోందని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu MS Dhoni and Rishabh Pant
MS Dhoni and Rishabh Pant. (Getty Images)


‘‘రిషబ్ పంత్ గత ఏడాది గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి సపోర్ట్‌గా నిలుస్తోంది. దానికి కారణం పంత్ స్పెషల్ ప్లేయర్ అని నమ్మడమే. ఒక్కసారి అతను టచ్‌లోకి వస్తే.. ఆ తర్వాత నిలకడగా పరుగులు రాబట్టగలడు. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. దానికితోడు వరుస ఫెయిల్యూర్స్ కారణంగా రిషబ్ పంత్ ఒత్తిడిలో ఉన్నాడు. కానీ.. ఇలాంటి ఎదురుదెబ్బలే అతడ్ని మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి’’ అని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.

షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. ఈ టోర్నీకి ముందు జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవాలని ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ రెండు టోర్నీలపైనా సందిగ్ధత నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.